Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్
Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి రామజన్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే రైలు సర్వీసులు చాలా అందుబాటులోకి వచ్చాయి.అయితే త్వరలో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్లడించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర ప...