Thursday, June 19Thank you for visiting

Tag: hyderabad news

Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

National
Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశార‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమ‌వారం ఆయ‌న కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశార‌న్నారు. నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు. Kacheguda : గ్రీన్ రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాటినం రేటింగ్‌ గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండ...

Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

Telangana
Amrit Bharat Station Scheme : రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద 'నయ భారత్ నయ స్టేషన్' చొరవలో భాగంగా చేపట్టిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ (Malkajgiri railway station) పునరాభివృద్ధికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రతిపాదిత అభివృద్ధి పనులలో దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో, అన్ని పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధి కోసం సుమారు రూ. 27.61 కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ (Malkajgiri railway station) లో అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు . సికింద్రాబాద్ నుండి 3 కి...

Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు

Crime
Hanuman temple | హైద‌రాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధ‌వారం ఉద‌యం మాంసం ముక్కలను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ప‌డేయడం క‌ల‌క‌లం రేపింది. భ‌క్తులు వెంట‌నే ఆల‌య‌ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న‌ టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. బుధవారం తెల్లవారుజామున టప్పాచబుత్రలోని హ‌నుమాన్ ఆలయం వ‌ద్ద‌ కొంతమంది వ్యక్తులు మాంసం ముక్కలను విసిరిన తర్వాత నగరంలోని ప్రశాంత వాతావరణం చెదిరిపోయింది . హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలను కనుగొని వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. విషయం తెలియగానే, పెద్ద సంఖ్య‌లో ప్రజలు ఆలయం వద్ద ...

Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..

Telangana
Hyderabad News : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో న‌గ‌ర‌వాసుల‌కు ట్రాఫిక్ చిక్కుల‌ను దూరం చేయ‌డానిక ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయ‌నున్నారు. మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ జంక్షన్‌, కేబీఆర్‌ ఎంట్రన్స్ జంక్షన్‌, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్డు నెంబ‌ర్‌. 45 , ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్, మహారాజా అగ్రసేన్‌ జంక్షన్, క్యాన్సర్‌ అస్పత్రి జంక్షన్లను జీహెచ్‌...

ED raids | మంత్రి పొంగులేటికి షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు

తాజా వార్తలు
ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ ...

Hydra News | స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్‌, మాదాపూర్‌లో ఆక్రమణల నేలమట్టం

Telangana
Hydra | హైద‌రాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత‌ల‌ను మరింత ముమ్మ‌రం చేసింది. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్లం చేస్తోంది. కాగా దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించ‌కుండా అనుమ‌తులు లేకుండా భారీ విల్లాలు నిర్మించారు.దీంతో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకోకుండా అక్క‌డ భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహరించారు. ఇదిలా ఉండ‌గా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేల‌మ‌ట్టం చేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో విస్త‌రించి ఉండ‌గా దీని ప‌రిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో వెలిసిన షెడ్లు, భవనాలను హైడ్రా బుల్ డోజ‌ర్‌ కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్‌ల...

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

Telangana
ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...

కుళ్లిపోయిన మటన్‌తో బిర్యానీ.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ పై కేసు

Telangana
Taskforce Checkings : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) ఆస్మికంగా సోదాలు చేయగా నాసిరకం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోతున్న మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో వండి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చినపుడు దానిని వేడి చేసి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ నాసిరకమైన టీ ఫౌడర్ ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌, ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని అధికారులు తేల్చారు. కిచెన్‌లో పరిసరాలు అత్యంత దారుణంగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో హోటల్ కేసు నమోదు చేసి రూ.లక్ష వరకు జరిమానా విధించారు అధికారులు. Task force team has conducted inspections in...

Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

Trending News
Bharat Rice | పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) (NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలు ఈ భార‌త్ రైస్ ను విక్ర‌యించాల‌న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్ హైద‌రాబాద్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్‌ రైస్ అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. గ‌త‌ 15 రోజులుగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయ‌ని నాఫెడ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా భార‌త్ రైస్ పై త‌గినంత ప్రచారం లేకపోవడంతో 15రోజులుగా అమ్మ‌కాలు...

Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్

Telangana
Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభ‌వార్త. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌కు వెళ్లేందుకు ఇప్ప‌టికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.అయితే త్వ‌ర‌లో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైద‌రాబాద్‌ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్ర‌వేశ‌పెట్టనున్నామ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్ల‌డించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర ప...
Exit mobile version