Thursday, June 19Thank you for visiting

Tag: Hyderabad metro

Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Telangana
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో  మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్  స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు  లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది. నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు.. ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో  సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని  హైదరాబాద్ మెట్రో...

Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Telangana
Old City Metro Project : హైదరాబాద్‌లోని ‌పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్‌ ‌నగర్‌ ‌డిపో వ‌ద్ద‌ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ ‌సిటీ కాదు.. ఒరిజినల్‌ ‌హైదరాబాద్‌.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత త‌మ‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మెట్రో స్టేష‌న్లు ఎక్క‌డ‌? మెట్రో లైన్‌ ఎంజీబీఎస్‌, ‌దారుల్‌ ‌షిఫా జంక్షన్‌, ‌పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ ‌చౌక్‌, అలీ జాకోట్ల, ర్‌ ‌మోమిన్‌ ‌దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్‌ ‌గ...

Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Telangana
New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది. మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...

రు.60,000 కోట్లతో మెట్రో విస్తరణకు ప్రణాళిక

Telangana
ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్ హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రూ.60,000 కోట్ల వ్యయంతో కొత్త మెట్రో రైలు ప్రాజెక్టులకు   రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర మంత్రివర్గం భారీ ప్రణాళికను ఆమోదించింది. ప్రతిపాదిత మెట్రో రైలు విస్తరణకు రాష్ట్రానికి కేంద్రం సాయం అందుతుందన్న నమ్మకం ఉందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. ఆరు గంటలకు పైగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. హైదరాబాద్ మెట్రో రైలుపై కీలక నిర్ణయం తీసుకుంది. “కేంద్ర సహాయం రాకుంటే మేమే సొంతంగా నిధులు సేకరిస్తాం. ఎలాగైనా, 2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది, అందులో BRS కీలక పాత్ర పోషిస్తుంది, ”అని కే.రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నగర రవాణా వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా మార్చాలని యోచిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నుంచి దేశ...
Exit mobile version