Wednesday, March 5Thank you for visiting

Tag: Hyderabad metro

Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Telangana
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో 'Me Time On My Metro' పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు. ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చ...

Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

National
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక‌ల (New year 2025) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవ‌ల‌ను పొడిగించిన‌ట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధ‌రాత్రి 1:15 AM వ‌ర‌కు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌తో అర్థరాత్రి వేళ ప్ర‌యాణికుల‌కు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు. లేట్ నైట...

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

Telangana
Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు ప్రజలకు సేవలందించనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఐదు కారిడార్లు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ : 36.8 కిలో మీటర్లు రాయ్ దుర్గం నుంచి కోకాపేట్ : 11.6 కి.మీ MGBS నుంచి ఓల్డ్ సిటీ : 7.5 కి.మీ మియా పూర్ నుంచి పటాన్ చెర్వు ;...

Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Telangana
Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మ...

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..

Telangana
Metro Rail Parking Fee | హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముగింపు ప‌ల‌కబోతున్న‌ది. నాగోల్‌ స్టేషన్‌లో ఇప్ప‌టికే పార్కింగ్‌ ఫీజుల‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. గ‌త బుధ‌వారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్ర‌యాణికుల‌కు రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొత్త‌ బోర్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. పార్కింగ్‌ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొన‌డంతో స్టేషన్‌లో నిరసన చేప‌ట్టారు. పార్కింగ్‌ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్‌ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ త‌ర్వాత‌ మెట్రో రైలు సంస్థ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. బైకు రూ.40, కారుకు రూ.120 నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్ప‌ష్టం చేసింది....

Hyderabad Metro | రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు

Telangana
Hyderabad Metro | హైద‌రాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంద‌ని భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. కాగా, 2024 - 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించిన‌ట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్...

Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Telangana
Metro Tickets | హైదరాబాద్ ప్రయాణికులకు ఎండ్-టు-ఎండ్ ర‌వాణా సౌక‌ర్యాన్ని అందించడానికి, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో (Rapido) యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ల వద్ద రద్దీ కూడా తగ్గిపోతుంది. రాపిడో ద్వారా ప్రయాణికులు కనీసం 15 శాతం టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది. ప్రయాణికులు ఇప్పుడు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వారు కోరుకున్న గమ్యస్థానానికి మెట్రో టిక్కెట్‌ల (Metro Tickets)ను సజావుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. చేయవచ్చు. మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapid...

మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్

Telangana
Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది.  గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నందున  మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా మియాపూర్ - పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో మినహా NH సెంట్రల్ మీడియన్‌లో మెట్రో వయాడక్ట్ నిర్మించాలని ప్రతిపాదించారు. జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద, ప్రతిపాదిత BHEL మెట్రో స్టేషన్‌ను TGSRTC బస్ స్టాప్‌తో అనుసంధానిస్తూ, ఫ్లైఓవర్  ఎడమ వైపుకు మెట్రో అలైన్‌మెంట్ తీసుకున్నారు.  గత రెండు రోజులుగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD NVS రెడ్డి HAML...

Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?

Telangana
Hyderabad New Metro Stations | హైదరాబాద్‌: కొత్త ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌, స్టేషన్‌ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (HMAL ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి శనివారం నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు. కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ నీటి పైపులు, హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్‌లు మారకుండా ఉండేందుకు మూసీ దగ్గర దాదాపు 10 మీటర్ల వరకు అలైన్‌మెంట్ ఎడమ వైపుకు మార్చాలి. మూసీ నదిని దాటడానికి, మూసీ పునరుజ్జీవన పనులను సులభతరం చేయడానికి ఎక్కువ పొడవైన మార్గాలను ప్లాన్ చేయాలి. కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి సమీపంలోని కాలనీల ప్రయాణ అవసరాలకు కనెక్ట...

Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..

Telangana
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో  మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్  స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు  లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది. నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు.. ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో  సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని  హైదరాబాద్ మెట్రో...
Exit mobile version