Thursday, June 19Thank you for visiting

Tag: GHMC

Telangana BJP| బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ బండి సంజ‌య్‌?.. ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం

Telangana
Telangana BJP president post : తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్ష పదవికి బండి సంజ‌య్ (Bandi Sanjay) పేరు మ‌రోసారి తెర‌పైకి వచ్చింది. ప్ర‌స్తుతం ఈ ప‌ద‌వి (BJP Telangana president post)లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, జి.కిష‌న్‌రెడ్డి (G Kishan Reddy) ఉండ‌గా సంస్థాగ‌త ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ బండి సంజ‌య్ పోటీ ప‌డుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి (MP and Union minister )గా బండి సంజ‌య్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష పద‌వి (Telangana BJP president post) రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు (ex-MLC Ram Chander Rao) పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. Telangana BJP president post : బండి సంజయే ఎందుకు? తెలంగాణ బీజేపీ (Bharatiya Janata Party (BJP) అధ్యక్షగా ఉన్న బండి సంజ‌య్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల (state Assembly elections) ముం...

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Telangana
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే.. గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మా...

Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Telangana
ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధ‌మైంది. Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్ర‌క్రియ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సుల‌భ‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ఒక్క‌సారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్...

Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహ‌నాల పార్కింగ్ పై కీల‌క ఆదేశాలు

Telangana
హైదరాబాద్‌: గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా షాపింప్ మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్ ల‌కు తెలంగాణ సర్కారు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్‌ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ కొనుగోలు రసీదు అందజేస్తే పార్కింగ్‌ ఉచితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ మాల్స్‌లు వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందాలు గుర్తించాయి. ఒకే స్క్రీన్‌గా రిజిస్ట‌ర్ అయిన ఒక థియేటర్ ప్రాంగణంలో మల్టీ స్క్రీన్‌...

TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు

Local
హైద‌రాబాద్ లోని శివారు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌ (Hyderbad IT Corridor)కు టీజీ ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచింది. గ్రేట‌ర్ శివారు ప్రాంతాల నుంచి ప్ర‌తి రోజు లక్షలాది మంది రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన బ‌స్సు సౌక‌ర్యం లేకపోవ‌డంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీజీ ఆర్టీసీ ఫోక‌స్ పెట్టింది. గురువారం నుంచి ఘట్‌కేసర్ (Ghatkesar), రాజేంద్రనగర్ ( Rajendranagar) ప్రాంతాల నుంచి కొండాపూర్‌కు కొత్త‌గా సర్వీసులను ప్రారంభించనుంది. టీజీ ఆర్టీసీ కొత్తగా 282కే, 215 రూట్లలో ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల నుంచి కొండాపూర్‌(Kondapur) వెళ్లేందుకు గురువారం నుంచి కొత్తగా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాచిగూడ డిపోకు చెందిన రెండు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఘట్‌కేసర్‌ నుంచి కొండాపూర్‌కు, రాజేంద్రనగర్‌ డిపో నుంచి రెండు ఆర్డినరీ బస్సులను 215 మా...
Exit mobile version