Thursday, June 19Thank you for visiting

Tag: Farmers

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

National, తాజా వార్తలు
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు. ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్...

PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

National
PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవ‌కాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది. ఈ కీల‌క స‌మావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని కూడా సు...

Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Telangana
Crop Loans | మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy, ) రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తానని హామీలు గుప్పించారు. దాదాపు ప్రతి ఎన్నికల ర్యాలీలో దేవుని పేరు మీద ఆయన ప్రమాణాలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన ముందున్న కఠినమైన వాస్తవం ఏమిటంటే, రైతులను అప్పుల కాడి నుండి విముక్తి చేయడానికి సీఎంకు ₹ 33,000 కోట్ల మేర నిధులు అవసరం ఉంది. కనీస మద్దతు ధర కంటే బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.500 చెల్లించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రం ఇప్పటికే సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఇది సామాజిక భ...

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Telangana
Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.. మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష...
Exit mobile version