Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Enforcement Directorate

National Herald Case | కాంగ్రెస్ కు షాక్.. ‘నేషనల్ హెరాల్డ్ కేసు’లో ఈడీ దూకుడు..
National

National Herald Case | కాంగ్రెస్ కు షాక్.. ‘నేషనల్ హెరాల్డ్ కేసు’లో ఈడీ దూకుడు..

National Herald Case : అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పై PMLA కేసులో ED మళ్ళీ ఉచ్చు బిగించడం ప్రారంభించింది. మూడు నగరాల్లో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ED సన్నాహాలను ప్రారంభించింది. కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ED నోటీసు జారీ చేసింది.అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తిని రిజిస్ట్రార్లకు రూ.661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 8 మరియు సంబంధిత నిబంధనలలోని రూల్ 5(1) ప్రకారం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించి ఏప్రిల్ 11 (శుక్రవారం)న మూడు నగరాల్లోని ఆస్తి రిజిస్ట్రార్లకు ED నోటీసులు జారీ చేసింది. ED నోటీసు జారీ చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస...
National

MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోప...
తాజా వార్తలు

ED raids | మంత్రి పొంగులేటికి షాక్‌.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు

ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ ...
తాజా వార్తలు

Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ

Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయ‌డానికి వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం అంగీక‌రిచ‌క‌పోవ‌డంతో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ధిక్కరిస్తూ, జూనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల సిట్ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే "రాజకీయ శక్తులు" నిరసనలను ప్రభావితం ...
National

Delhi liquor policy : ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ

Delhi liquor policy | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు ఈ ప్రకటన చేశారు . ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఇది EDకి సంబంధంచి తొమ్మిదవ అనుబంధ ఛార్జిషీట్ అవుతుంది. ముందుగా చెప్పిన‌ట్లుగానే ఈ కేసులో ఆప్‌ని నిందితుడిగా పేర్కొన‌నున్న‌ట్లు ఈడీ.. ఢిల్లీ హైకోర్టుకు విన్న‌వించిన‌ రెండు రోజుల తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది . కేసులో కీల‌కాంశాలు ఈ కేసు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించినది. Delhi liquor policy కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీ...
Crime, National

ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..

ED raids in Jharkhand | జార్ఖండ్‌ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు సోమవారం అక‌స్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) ప‌లు పథకాల అమలులో అక్ర‌మాలు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమ‌వారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన‌ సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్ట...
Crime, National

Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగ...
National

Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ కు బిగ్ షాక్..

ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Kejriwal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.  మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ప్రత్యేక  కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన దర్యాప్తు సంస్థ , తదుపరి తేదీలో వారికి మరింత కస్టడీ అవసరమని కోర్టుకు తెలిపింది. ఇడి తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు మాట్లాడుతూ, కస్టడీ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధినాయకుడు "నాన్-కోపరేటివ్" గా ఉన్నారని అన్నారు."అతను ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు పాస్‌వర్డ్‌లు ఇవ్వలేదు" అని రాజు కోర్టుకు వెల్లడించారు. అయితే కోర్టులో ప్రవేశించే ముందు అరవింద్ విలేకరులతో మాట్లాడుత...
National

Delhi Liquor Scam | దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు ​​జారీ

Delhi Liquor Scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మ‌రో దిల్లీ ఆప్ పార్టికీ చెందిన‌ మంత్రికి ఈడీ స‌మ‌న్లు పంపింది. దర్యాప్తు అధికారి ముందు శనివారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు ​​పంపినట్లు అధికారులు తెలిపారు. విచారణ కోసం ఫెడరల్ ఏజెన్సీ గహ్లాట్‌ను పిలిపించడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం ED కస్టడీలో ఉండగా, సంజ‌య్‌ సింగ్, సిసోడియా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా వుండ‌గా ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ED ఆరోపణను AAP ఖండించింది. నకిలీ ఆరోపణలపై ప్రత్యర్...
National

Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ షాక్.. మరో 4 రోజులు కస్టడీ పొడిగింపు

Delhi liquor policy scam : న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు గ‌ట్టి షాక్ త‌గిలింది. మరో నాలుగు రోజులపాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించిన‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీపై పలు ప్రశ్నలు సంధించారు . గురువారం ఉదయం కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌‌కు అనుమతి లభించింది. ఈ సంద‌ర్బంగా ఈడీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ తనను, తన పార్టీని అణచివేయడానికి యత్నిస్తోందన్నారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించలేదని తెలిపారు. ‘నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఏ కోర్టు కూడా నన్ను దోషిగా నిరూపించలేదు.. సీబీఐ 31 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈడీ 25 వేలపేజీలు దాఖలు చేసింది. వాటిని కలిపి చదివినా నన్ను ఎందుకు అరెస్టు చేశారనే ప్రశ్న మిగిలిపోయింది అని కేజ్రీవాల్‌ కోర్ట...
Exit mobile version