Thursday, June 19Thank you for visiting

Tag: Electricity Department

Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

National
Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయ‌న ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంప‌రింగ్ నిజ‌మ‌ని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన‌ కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపింది. ఎంపీ ఇంటి ...

Bulldozer action | సంభాల్ లో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌.. ఇక్క‌డ విద్యుత్ స్థంభాల‌నూ ఆక్ర‌మించుకున్న ఘ‌నులు

National
Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్‌ (Sambhal) లో అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేశారు. ప‌ట్ట‌ణంలో కొంతమంది నివాసితు రోడ్ల‌ను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్ర‌మించేసుకున్నారు అని ప‌ట్ట‌ణ‌ సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి (SDO) తెలిపారు. "కొందరు విద్యుత్‌ కనెక్షన్, సరైన మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. లోపల ఇంకా పాత మెకానికల్ క‌రెంట్‌ మీటర్ ఉంది. పాత మీటర్లను 15 సంవత్సరాల క్రితం నిలిపివేశాం. అందుకే ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము" అని బుల్డోజర్ చర్య సందర్భంగా త్రిపాఠి ANIకి తెలిపారు. "మెకానికల్ మీటర్లను ఇకపై అమర్చకూడదని 15 సంవత్సరాల క్రితం ఆదేశాలు వచ్చాయి. పాత మీట‌ర్లు ఎక్క‌డ క‌నిపించినా దానిని అధికారులు వెంట‌నే తొల‌గిస్తారని తెలిపారు. సంభ‌ల్ లో దాదాపు 2-3 ఇళ్లలో విద్యుత్‌ను దొంగిలించడం కనిపించిందని, అయితే మొత్తం ఇళ్ల సంఖ్య విచారణ తర్వాత త...

Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

Career
Bhatti Vikramarka On Job Notification |  నిరుద్యోగులకు ప్రభుత్వం (Congress Governament) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu )  వెల్లడించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాకలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్స్ ఇచ్చామని తెలిపారు.. క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ క...
Exit mobile version