Thursday, June 19Thank you for visiting

Tag: EC

Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

Elections
Lok Sabha Elections : లోక్‌సభ మొద‌టి ద‌శ‌ ఎన్నికలు రేపు ప్రారంభం కానుండగా, ప్రజల నుంచి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లోకి తమ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవచ్చా లేదా అనేది చాలా మంది ఓటర్ల కు డౌట్ వ‌స్తుంటుంది. ఒక ఫోన్ల గురించే కాకుండా ప‌లు కీలకమైన ప్రశ్నల‌కు ఈ క‌థ‌నంలో స‌మాధానాలను తెలుసుకోవ‌చ్చు.. పోలింగ్ బూత్‌లలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతిస్తారా? ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, సమగ్రతను కాపాడేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్‌లను పోలింగ్ స్టేషన్‌ల లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమ‌తి లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్ల‌డానికి వీలు లేదు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వేసే వాతావరణాన్ని సృష్టించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధ‌న‌లు రూపొందించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకారం, ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ...

Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచ‌న‌లు ఇవే..

Trending News
Heatwave Warning | వేస‌విలో తీవ్రమైన ఎండ‌ల నుంచి ప్రాణాంతక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని ప‌నుల‌ జాబితాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (EC ) జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ఈ నేపథ్యంలోనే ఈసీ ఓట‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. IMD అంచనాకు సంబంధించి, EC ఒక వివరణాత్మక సలహాను జారీ చేసింది, ఇది హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి, తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (National Disaster Management) జ...

మీకు “ఓటర్​ స్లిప్​” ఇంకా అందలేదా? సింపుల్​గా ఇలా పొందండి..!

Telangana
తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్​ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్​ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip)​ అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్​ స్లిప్​ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. ఓటర్ స్లిప్ తో  లాభం ఇదే.. మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ ఓటరు స్లిప్ ఎందుకు? అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో సుమారు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలుంటుంది. ఆ పో లింగ్ కేంద్రం ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన వద్ద ఉండాలి. ఓటు వేయడానికి మనం వెళ్లినప్పుడు.. ఓటరు ఐడీ కార్డు లేదా.. వేరే ఇతర గుర్తింపు కార్డు తో పాటు.. ఈ స్లిప్ తీసుకెళ్తే.. త్వరగా ఓటు వేసేయవచ్చు. ...

అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

Telangana
హైదరాబాద్: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతో పాటు మరో 10 మంది పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం(Election commission ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భోంగిర్, నిర్మల్ జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొమ్మిది మంది జిల్లా మేజిస్ట్రేట్లు/డీఈవోలు, 25 మంది పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు/ఏడీఎల్‌లను బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఎస్పీలు, నలుగురు కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానెల్‌ను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదే...
Exit mobile version