MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివర్గం వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూరనుంది.
#Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25
The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut
— Sheyphali ...