Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Delhi

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు
Trending News

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది. సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు: ఈ స్టేషన్ 4 రైలు మార్గాలు, 6 ప్లాట్‌ఫారమ్‌లు కలిగి ఉంది. 5 ప్రవేశ/నిష్క్రమణ గేట్లు, 14 ఎలివేటర్లు, 18 ఎస్కలేటర్లు ఉన్నాయి. స్టేషన్ పొడవు 215 మీటర్లు, వెడల్పు 50 మీటర...
National

పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్

Namo Bharat station corridor  | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం, ముఖ్యమైన నిర్మాణ పనులు, విద్యుదీకరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ మధ్య ట్రయల్ రన్స్.. మార్చి చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ప్రకారం న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ పనులు పూర్తయ్యాయి. Namo Bharat station corridor : దీనితో ప్రయోజం ఏమిటి? ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌ను హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ (ISBT)తోపాటు రింగ్ రోడ్‌లతో అను...
Trending News

RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం

RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జ‌నాద‌వాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ భ‌వ‌న‌ సముదాయం 3.75 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయం 13 అంతస్తులను కలిగి ఉంది, ఇందులో దాదాపు 300 గదులు ఉన్నాయి. ఈ కార్యాల‌య పునర్నిర్మాణానికి రూ. 150 కోట్లు వెచ్చించింది. 75,000 మందికి పైగా మద్దతుదారులు పునరుద్ధరణకు విరాళాలు అందించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagavat) , ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఫిబ్రవరి 19న జరిగే “కార్యకర్త సమ్మేళన్”కు హాజరవుతారు, ఈ సందర్భంగా సంస్థ కొత్త అధునాత‌న‌ కార్యాలయానికి అధికారికంగా తిరిగి వస్తుంది. RSS New Office : కొత్త భ‌వ‌నం ఎలా ఉంది.. గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ డేవ్ కొత్త ఆర్ఎస్ఎ...
Elections

Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువ‌రించాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గ‌త‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. 2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో తమ పార...
Trending News

Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్

Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భార‌తీయ రైల్వే అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌త్యేక రైళ్ల ను న‌డిపిస్తోంది. రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించ‌డంతోపాటు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో వందేభార‌త్ రైళ్ల‌ను కూడా అన్ని మార్గాల్లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను త‌క్కువ దూరం గ‌ల మార్గాల్లో న‌డిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వ‌చ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాల‌ని భావిస్తున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగ‌ల‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాల‌ని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్ర‌యాణికుల‌ రద్దీకి అన...
Business

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి....
National

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్‌ల వందే భారత్ ...
National

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు: మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
Business

DIAL | జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికెట్ తొలి ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం..

న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIAL) అనుబంధ సంస్థ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ హోదాను పొందింది. భారతదేశంలో ఈ హోదా ద‌క్కించుకున్న‌ మొదటి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అవతరించింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఈ సర్టిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ముఖ్యాంశాలు: పునరుత్పాదక శక్తి : DIAL విమానాశ్రయం ఎయిర్‌సైడ్ ఏరియాలో 7.84 MW సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఓపెన్ యాక్సెస్ ద్వారా అదనపు పునరుత్పాదక విద్యుత్‌ను అందిస్తుంది. విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది, సంవత్సరానికి సుమారు 200,000 టన్నుల CO2ను నివారిస్తుంది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ : ఢిల్లీ విమానాశ్రయం టె...
National

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్) రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్) రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్) రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్) రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్) మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద...
Exit mobile version