Wednesday, June 18Thank you for visiting

Tag: Congress Govt

ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్

Telangana
Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్ల‌లో నిరుపేద‌ల కోసం 20 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం వెల్ల‌డించారు. హియాయ‌త్‌న‌గ‌ర్‌లోని హౌసింగ్ కార్పొరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు. 33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లు ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్ధాయి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. ప్రతి సంవత్సరం నాలుగున్న‌ర ల‌క్ష‌ల చొప్పున రానున్న నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల‌కు పైగా నిరుపేద‌ల‌కు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామ‌ని మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేష‌న్ బ‌లోప...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్

Telangana
Land acquisition For Elevated Corridor : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారికంగా సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంలో భూసేకరణ అనేది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రహదారి 1 (రాజీవ్ రహదారి)పై జింఖానా గ్రౌండ్ నుంచి శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్.. భూ సేకరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 'స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్' (ఎస్‌ఆర్‌డిపి) కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లను 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప...

Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

Telangana
November 14th Praja Vijayotsavalu | రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలపై  ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు  పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  ఈ సంవత్సర కాలంలో ఎన్నో విప్లవాత్మక, ...

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...

Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట

Telangana
Current Charges Hike In Telangana | హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు​ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించిన‌ట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిర‌స్క‌రించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్ల‌డించారు. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామ‌ని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేద‌న్నారు. స్థిర చార్జీలు రూ.10 యధావిధిగా ఉంటాయ‌ని, పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేద‌ని హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్...

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Telangana
Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొద‌లుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ‌ పార‌ద‌ర్శకంగా జ‌రిగేలా చ‌ర్య‌లు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులుచేర్పులు చేసిన త‌ర్వాత త్వరలోనే యాప్ ను విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇండ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక అత్యంత‌ పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు అందిస్తామ‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక నిమిత్తం రూపొందించిన యాప్‌ను శ‌నివారం ఆయన స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో ప‌రిశీలించారు. అయితే ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార...

దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..

Telangana
Hydra Pilot Project :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.   హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది.  హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువుల పూర్వభవం కోసం  పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణ చేయాలని అది కూడా  ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో  బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును హైడ్రా ఎంపిక చేసింది. హైదరాబాద్ లో  తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమ వైపులా ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. ఇందుకు నెలరోజుల సమయం కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ...

తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..

Telangana
Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్ నియ‌మించింది. తెలంగాణ ప్ర‌భుత్వం. వీసీల నియ‌మాక ఉత్వ‌ర్వుల‌పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తిగా కుమార్, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్ర‌తాప్ రెడ్డి, తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా యాద‌గిరి రావు, తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా నిత్య‌నంద‌రావు, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా అల్తాఫ్‌ హుస్సేన్, పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ వీసీగా అల్దాస్ జాన‌య్య‌, కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం వీసీగా ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి నియ‌మితుల‌య్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అ...

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...

Ration Card Application | కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సై.. వచ్చేనెల 2 నుంచి దరఖాస్తులు

Telangana
Ration Card Application |  ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రేష‌న్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. రేష‌న్ కార్డులు మంజూరుకు ప‌టిష్ట‌మైన‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ (Ration Card Application ) ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. అర్హులంద‌రికీ డిజి...
Exit mobile version