Wednesday, June 18Thank you for visiting

Tag: Congress Government

TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

Telangana
TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షా...

Self Help Groups | మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..

Telangana
Self Help Groups RTC Buses | రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండ‌ల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బ‌స్సులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను సైతం మంగళవారం విడుదల చేసింది. ఒక్కో బ‌స్సు విలువ రూ.36 ల‌క్ష‌లు. ఒక్కో మండ‌ల స‌మ‌ఖ్య, ఒక్కో బ‌స్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇవ్వ‌నుంది.నెలకు అద్దె రూపంలో మండ‌ల స‌మ‌ఖ్య(Self Help Groups) కు టిజి ఆర్టీసీ (TGSRTC) రూ. 77, 220 చెల్లించ‌నుంది. మొత్తం 150 అద్దె బ‌స్సుల‌ను ఆర్టీసికి మండ‌ల స‌మ‌ఖ్యలు అప్పగించనున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోల‌కు ఆయా బ‌స్సుల‌ను విన‌యోగించ‌నున్నారు. మొదటి విడతలో ఈ జిల్లాలకు కాగా మొద‌టి విడ‌త‌లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ జిల్లాల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఈ నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో ఆర్థికంగా ప...

MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

National
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోప...

Metro Rail Phase-2 | ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్.. ఫైన‌ల్ డీపీఆర్ లు సిద్ధం!

Telangana
Metro Rail Phase-2 Corridors | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ వ‌చ్చింది. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డిపిఆర్‌లు) పూర్తవుతున్నాయని సీనియర్ అధికారులు ఆదివారం ప్రకటించారు. దాదాపు రూ. 32,237 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భాగ్య‌నగరం అంత‌టా మెట్రో క‌నెక్టివిటీని అందిస్తుంది. డీపీఆర్ పై ముఖ్యమంత్రి సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో డిపిఆర్ తయారీపై సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్, కీలక ఫీచర్లు, స్టేషన్ స్థానాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అందించారు. ఫేజ్-2 మొత్తం 116.2 కి.మ...

Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?

Telangana
Registration Charges | తెలంగాణ‌లో రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నవంబర్‌ నుంచి సవరించిన చార్జీలను అమ‌లు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల‌కు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అంద‌జేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించ‌లేదు. ఈ క్ర‌మంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక‌ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేర‌కు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్‌ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. హైద‌రాబాద్ ర...

Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana
RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Hyderabad| తెలంగాణ రాష్ట్ర‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల‌ను వేగవంతం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై కలెక్టర్లు ఇక నుంచి రోజూవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యన‌ అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలన...

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

Telangana
వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15‌లోపు చేస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15‌లోపు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చాలెంజ్‌ ‌చేశారని.... కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపు...

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

Telangana
New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు. “మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ...

Elevated Corridor Project | హైద‌రాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక‌..

Telangana
Elevated Corridor Project | హైద‌రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న‌ మార్గాల్లో చేప‌ట్ట‌నున్న‌ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. ఈ కారిడార్లకు సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలు, అలాగే వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఓ కన్సల్టెన్సీని హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయ‌నుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నియమాకం చేసే కన్సల్టెన్సీ నివేదిక కీలకమ‌వుతుంది. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ హైదరాబాద్‌ - కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ ను...

Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం

Telangana
Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగ‌న్ వాడీ టీచ‌ర్ల‌కు, స‌హాయ‌కుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైద‌రాబాద్ లోని రహమత్‌ ‌నగర్‌లో జరిగిన అమ్మమాట - అంగన్‌ ‌వాడీ బాట కార్యక్రమంలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క వెల్ల‌డించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన‌ జీవో జారీ చేస్తామని చెప్పారు. అంగన్‌ ‌వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌ ‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గత కొన్ని రోజులుగా ఆందోళన చేప‌డుతున్నారు. త‌మ‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ‌ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తూ వ‌స్తున్నారు. ఈమేర‌కు జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌ ‌వాడీల...
Exit mobile version