Wednesday, June 18Thank you for visiting

Tag: CM Revanth Reddy

Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..

Telangana
Elevated Corridor | ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నగరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు ట్రాపిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) ప్రాంతంతో ఇరుకైన రోడ్డులో వాహనదాారులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. క్యారిడార్ నిర్మాణం రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం సమీపంలో గల ప్యాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై కార్ఖానా, తిరుమలగిరి, బల్లారం, ఆళ్వాల్, హకీంపేట, తూంకుంట. మీదుగా శామీర్ పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి రాజీవ్ ర‌హ‌దారిపై 11.12 కిలో మీట‌ర్ల పొడ‌వుతో ఆరు లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు....

PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

Telangana
PM Modi Tour Live Updates | Sanareddy : తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ జరిగాయని, ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని  ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించేదుకు  మీ సహకారం కావాలని కోరారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ  సంగారెడ్డిలో  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై  విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బందం ఉంది. దీని గురించి ప్రపంచమంతా  తెలుసు. కాంగ్రెస్‌ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది.   కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్లు దండుకుంది.  కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతోంది. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగింది తెలిసినప్పటికీ కాంగ్రెస్  ఎందుకు మౌనంగ...

Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Telangana
TS DSC Notification 2024:  నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది.  గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. 2023 సెప్టెంబరు 6వ తేదీన  గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను  రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్తగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ సమయంలో  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్త...

ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ OTS ఆఫర్

Telangana
హైదరాబాద్ : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ  ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం  'వన్ టైమ్ స్కీమ్' (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. OTS కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది. 2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి న...

Mahalakshmi Scheme: రూ. 500 గ్యాస్ కు ఇవి ఉండాల్సిందే.. విధివిధానాలు ఇవే.. 

Telangana
Rs 500 Gas Cylinder Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ప్రారంభించారు. అలాగే రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ సర్కారు ((Telangana Government) మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకాన్ని ఎలా అమలు చేస్తారు? ఈ పథకానికి ఎవరు అర్హులు? వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.  సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోస...

Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధ‌న‌లు.. అర్హతలు ఇవే..

Telangana
Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు క‌ల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద‌ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీట‌ర్ నంబ‌ర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మ‌రో నిబంధ‌న‌.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాల్సి ఉంటుంది. గృహ జ్యోతి పథకం ఒక్క మీటర్ ఉన్న గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. అద్దెదారులు, అద్దె వసతి గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే.. మీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని గమనించండి. కరెంటు బిల్లు బకాయిలు ఉన్నవారు  లేదా గత రెండు నెలలుగా కరెంటు బిల్లు చెల్లించనివారు  ఈ పథకానికి ...

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...

Praja Palana Application Status : ప్రజాపాలన దరఖాస్తులపై ‘స్టేటస్ చెక్’ ఆప్షన్ వచ్చేసింది… ఒక్కసారి చెక్ చేసుకోండి..

Telangana
Praja Palana Applications Data Updates: ఆరు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం గతేడాది డిసెంబరు 28 నుంచి ప్రారంభమై జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా.. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా కోటికి పైగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటి దరఖాస్తుల్లోని మొత్తం వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలవారకు పూర్తికావొచ్చింది. తాజాగా సంక్రాంతి సెలవులు రావటంతో మూడురోజుల పాటు ఆగినప్పటికీ.. త్వరలోనే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కొత్త వెబ్ సైట్ ఇదే Praja Palana Application Status : ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి సంబంధించి https://prajapalana.telangana.gov.in/ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభిం...

New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana
TS New Ration Cards : తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. రేపటి నుంచి జనవరి 6 వరకు ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు.. దీనికి సంబంధించి సచివాలయంలో ‘ప్రజాపాలన’ లోగో, దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు బుధవారం ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏం చెప్పారు..? కొత్త రేషన్ కార్డుల మంజూరు (New Ration Cards)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫాంలను తీసుకు...

TS Mahalakshmi Scheme | బీపీఎల్‌ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్ ‌

Telangana
  TS Mahalakshmi Scheme : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం అర్హులకే అందించాలని చూస్తోంది. ఈ ఆరు పథకాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం. రూ.500లకే వంట గ్యాస్‌, మహిళలకు నెలకు రూ.2,500 వంటి పథకాలు ప్రజలను ఆకర్షించాయి. కాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి... గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో... కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీ పథకాల కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పథకాల అమలు కోసం... దరఖాస్తు ఫారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేశారు. ఈ క్రమంలో... రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుందని ఎంతో మంది భావించారు. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం... తెల్ల రేషన్‌ కార్డుతో ముడిపెట్టింది. అంటే.. బీపీఎల్‌ అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వం...
Exit mobile version