ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 36 మంది మావోలు హతం..?
Chhattisgarh : చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్మడ్లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్లోని నారాయణ్పుర్- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు.
చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్మడ్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు క...