Mudra loans | ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..
Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన పథకాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. కార్పొరేట్యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమలు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్...