Tuesday, March 4Thank you for visiting

Tag: brs

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

Telangana
TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్ తెర‌పై కి వ‌చ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చు. టికెట్ల విష‌యంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్...

Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

Telangana
Old City Metro | హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీకి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కనెక్టివిటీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . 78 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ ఫేజ్-2 విస్తరణకు నిధులు సమకూర్చేందుకు కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీని వల్ల నగర జనాభాలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్, ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ.. హెచ్‌ఎంఆర్‌ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. Old City Metro : జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం ఖర్చు పెట్టాలని ప్రతిపాదించగా, 15 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మిగిలిన వాటి...

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Telangana
ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి. కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి ...

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Elections
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది. EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పా...

Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

National
Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్న‌ది. మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు త‌గులుతున్నాయి. కవిత స‌మ‌ర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు ...

India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..   

National
India TV poll :   ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి  తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. కాగా India TV poll ప్రకారం..  కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లో బీజేపీకి చెందిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, జి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఒవైసీ హైదరాబాద్‌లో ముందంజలో ఉన్నందున, ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎఐఎంఐఎం తన సాంప్రదాయ నియోజకవర్గాన్ని నిలుపుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఇలా.. 2019 లోక్‌సభ...

Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు

National
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది.  ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా  కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా,   కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..  ఎమ్మెల్సీ కవితకు   రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.. కాగా  కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.  తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజక...

Rajya Sabha Elections 2024 : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు..

Telangana
Rajya Sabha Elections 2024 Updates: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ త‌మ‌ అభ్యర్థుల పేర్లను ఖ‌రారు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నాయ‌కులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు Rajya Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసింది పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది . ఈ మేరకు పార్టీ హై క‌మాండ్‌ ప్రకటన విడుదల చేసింది. మ‌రోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లను ప్ర‌క‌టించింది. కాగా రేపటితో నామినేషన్లకు గ‌డువు ముగియ‌నుండ‌డంతో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. T Congress Rajya Sabha Candidates : అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ త‌ర‌ఫున‌ 2018 అసెంబ్...

5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!

Telangana
ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం.. Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. కాగా తెలంగాణ రాష్ట్రం రూ. 5 లక్షల 59వేల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్ గా ఆర్థిక శాఖ బాధ్యతలను తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల...

KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

Telangana
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్‌, హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్య...
Exit mobile version