Corona virus | మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి
గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు
తెలంగాణలో కొవిడ్ చికిత్స పొందుతున్న 14 మంది
భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ తో ఆరుగురు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 14 కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను మొదటిసారి కేరళలో గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కేవలం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా నియంత్రణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుక...