Wednesday, June 18Thank you for visiting

Tag: BLA

Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు

National
Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army - BLA) ముప్పుతిప్పలు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై పైచేయి సాధిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుందని వార్తలు వస్తున్నాయి. క్వెట్టాలోని పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారీ దాడులు చేసింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్నట్లు BLA పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి తగలబడిపోతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌ను దాని సరిహద్దులో చుట్టుముట్టింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడి చేస్తోంది. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దానికి చుక్క...

Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

World
Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం. పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, బలూచిస్తాన్‌లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ ...
Exit mobile version