Monday, March 3Thank you for visiting

Tag: bengaluru

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

Trending News
High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు . High Speed Rail : విమానాల కంటే వేగంగానా? ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై అంతర్జాతీయ విమాన...

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

National
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. "స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు. Bengaluru Metro : బెంగళూరు మెట...

Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు

Crime
Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అత‌డి బావ‌మ‌రిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు. సర్కిల్ ఆఫీసర్ (సిటీ)...

AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..

Special Stories
రోడ్ల‌పై ఇష్టారాజ్యంగా వాహ‌నాలు న‌డుపుతామంటే కుద‌ర‌దు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్సీతో ప‌నిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మ‌ల్ని ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని త‌ప్పు చేసినా ఇట్టే ప‌సిగ‌ట్టి ఫొటోలు తీసి పోలీసుల‌కు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గ‌త మూడేళ్లలో రూ. 90 కోట్ల వ‌ర‌కు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగారు. 119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు మాత్రమే వ...

SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?

National
Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ.. ఆధునిక బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. తన పదవీకాలంలో, SM కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎక్క‌వ‌గా ప్రాధాన్యతనిచ్చారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అతని ప్రయత్నాల వల్లే బెంగళూరు "సిలికాన్ సిటీ(Silicon City)గా అవ‌త‌రించింది అలాగే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ(Silicon valley)కి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది, IT రంగంలో యువ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. టాస్క్ ఫోర్స్ (BATF) బెంగ‌ళూరు నగరం గ్లోబల్ సిటీగా పెంపొందించడానికి ఎస్ఎం కృష్ణ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 1999లో, ఆ...

ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైర‌ల్‌..

Viral
Bengaluru traffic jam | కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో ఎన్న‌డూ ఊహించ‌ని విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధార‌ణంగా వాహనాల ట్రాఫిక్‌తో మ‌హాన‌గ‌రాల్లో రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయిన గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే వేచి ఉండాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతుంటాయి. ట్రాఫిక్ చిక్కుల‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు సిటీది దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ మ‌న గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌డానికి గంట‌ల పాటు స‌మ‌యం ప‌డుతుంది. అయితే తాజాగా నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై న‌డిచే రైళ్లు కూడా బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోలేదు. ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుపోయేవి. కానీ ఇప్పుడు ఆ లిస్టులో ట్రైయిన్ కూడా వచ్చి చేరింది. బెంగ‌ళూరు నగరంలో ఒక‌ రైల్వే క్రాసింగ్‌ గేట్‌ వద్ద పలు వాహనాలు ముందు క‌దులుతుండ‌గా.. కొద్ది దూరంలో ఓ రైలు...

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

Special Stories
ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది. భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధా...

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు: మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...

14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు

National
14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన‌ శనివారం ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనను నిర్వహించనుంది. ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్ల గురించి KITU ఆధ్వ‌ర్యంలో రెండు వారాల పాటు శాంతియుతంగా నిర‌స‌న తెలుప‌నున్నారు. ఇందులో భాగంగా IT పార్కుల వద్ద గేట్ సమావేశాలు, వీధి నిరసనలు (street protests) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు ప్రమాణంగా 14 గంటల పనిదినాలను ఏర్పాటు చేయాలని కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్‌ అడిగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను “అమానవీయం” అని ఖండిస్తూ, ఇది ఉద్యోగుల ప్రాథమిక హక్...

508 కిలోమీట‌ర్లు.. ఆరు వరుసలు.. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే

Andhrapradesh
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను క‌లుపుతూ కొత్త హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య కొత్త‌ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాలకు త‌గిన‌ట్లుగా కొత్త‌గా మ‌రొక‌ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ ర‌హ‌దారి ఉంది. దీని తోడుగ మ‌రొక కొత్త నేషన‌ల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించ‌నున్నారు. ఈ ర‌హ‌దారితో నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య ప్ర‌జ‌లు, స‌రుకు ర‌వాణా మెరుగుప‌ర‌చాల‌ని మోదీ ప్ర‌భుత్వం రంఎడు సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహద...
Exit mobile version