Thursday, March 13Thank you for visiting

Tag: Bengaluru Metro

Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం

National
Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, "మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు. 7.5 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ (కలేన అగ్రహార నుంచి తవరేకెరె/స్...

Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

National
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావ‌చ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-3 లో రెండు ఎలివేటెడ్ కారిడార్లతో మొత్తం 31 మెట్రో స్టేషన్లతో 44.65 కి.మీ మేర విస్త‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం వేచి ఉంది. మొదటి కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుకు పశ్చిమ వైపున 32.15 కి.మీ.కు పైగా విస్తరించి, JP నగర్ నాల్గవ దశను కెంపపురాని...

Metro Rail News | బెంగళూరు మెట్రో రికార్డు.. ఒక్క‌రోజే 8 లక్షల మంది జ‌ర్నీ

National
Metro Rail News | బెంగళూరులోని నమ్మ మెట్రో (Namma Metro) స‌రికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో నమ్మ మెట్రో రూ. 25 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న‌ది. ఇది మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌లో గణనీయమైన పెరుగుదలగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా చెల్లాఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు అత్యంత ర‌ద్దీగా ఉన్న మార్గంగా మారింది. ఐటి కంపెనీలకు సేవలందించే మార్గం కావ‌డంతో ప్రయాణికుల సంఖ్య క్ర‌మంగా రెట్టింపు అవుతోంది. గతంలో, మెట్రో ప్రతిరోజూ 6.5 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేది. అయితే, కార్యాలయాలకు వెళ్లేవారు తిరిగి రావడంతో, ఈ సంఖ్య రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 8.11 లక్షలకు పెరిగింది. ప్ర‌యాణ‌కుల‌కు స‌రిప‌డా రైళ్ల సంఖ్య తొమ్మిది నుంచి పదిహేనుకు పెంచారు. ఫలితంగా ప్రతి మూడున్నర నిమ...

Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..

Viral
Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత "చాలా మురికిగా" ఉన్నాయని భావించారు. తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు. వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు...
Exit mobile version