Bullet Train | బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
Bullet Train | దేశంలో మరికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక మైన ట్రాక్ను రైల్వేశాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnav)ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్
దేశంలోనే తొలి బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (Ballastless Track ) వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్ -ముంబై (Gujarat-Mumbai)మధ్య నిర్మిస్తున్న ట్రాక్ గురించి సమాచారం అందించారు. అలాగే బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో చూపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నిర్మిస్తున్న ఈ ట్రాక్లు బ్యాలస్ట్లెస్గా ఉన్నాయని.....