Friday, April 18Welcome to Vandebhaarath

Tag: Ayodhya

దిగ్విజయంగా ప్రాణప్రతిష్ఠ.. ఎన్నికల వేళ బీజేపీలో సమరోత్సాహం..
Trending News

దిగ్విజయంగా ప్రాణప్రతిష్ఠ.. ఎన్నికల వేళ బీజేపీలో సమరోత్సాహం..

Ram Temple Inauguration: రామ మందిర ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనవరి 25న బులంద్‌షహర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ వరుస ర్యాలీలను బీజేపీ ప్లాన్ చేసింది. అయోధ్యలో గొప్ప రామ మందిర ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి దీర్ఘకాలంగా సాగుతున్న పోరాటానికి ముగింపు పలికింది. లోక్‌సభ ఎన్నికల కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ అపూర్వ ఘట్టం రాబోయే కొద్ది నెలలపాటు రాజకీయంగా హైప్ కొనసాగుతూ ఉంటుంది. జనవరి 25 నుండి పశ్చిమ యుపిలోని బులంద్‌షహర్ నుండి ప్రారంభమయ్యే ప్రధానమంత్రి ర్యాలీ మెరుపుదాడితో పాటు పార్టీ క్యాడర్‌ను సమీకరించడానికి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ (పవిత్ర) వేడుక తరువాత ఉత్తరప్రదేశ్ అంతటా బిజెపి వరుస కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో ఇంటింటికి 'పూజిత్ అక్షత్' పంపిణీ, దేవాలయాలలో పరిశుభ్రత డ్రైవ్, గ్రామాల్లో చౌపల్స్, రామ మందిర ఉద్యమ చరిత్రను వివరించే బుక్‌లెట్ల పంపిణ...
Trending News

Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..

ధన్ బాద్‌: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ పై రాసి రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతీ రోజు కేవలం గంట ...
Special Stories

Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాల గురించి తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఒకసారి చూడండి.. ఆలయ ప్రత్యేకతలు (Ram Mandir specialities) భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం అయోధ్య రామ మంది...
Trending News

ఒకేసారి ఎనిమిది దేశాల టైంను చూపించే వాచ్ ను తయారు చేసిన కూరగాయల వ్యాపారి

Ayodhya : ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన ఒక కూరగాయల వ్యాపారి ఏకకాలంలో ఎనిమిది దేశాల్లో సమయాన్ని సూచించేలా అద్భుతమైన గడియారాన్ని రూపొందించారు. దీనిని అయోధ్య రామమందిరాని (Ayodhya Ram Temple) కి బహుమతిగా ఇచ్చాడు. 52 ఏళ్ల కూరగాయల వ్యాపారి అనిల్ కుమార్ సాహు ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు 75 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా సాహూ మాట్లాడుతూ.."నేను అక్టోబర్ లో దేవీ నవరాత్రుల సమయంలో ఈ గడియారం (75 సెం.మీ.)పై పని చేయడం ప్రారంభించాను. ఇటీవల చంపత్ రాయ్ జీకి అలాంటి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చాను," అని తెలిపారు. గతంలో, అతను లక్నోలోని ఖతు శ్యామ్ దేవాలయం, కొత్వా ధామ్, బారాబంకిలోని కుంతేశ్వర్ మహాదేవ్ లకు కూడా అలాంటి గడియారాలను బహుమతిగా ఇచ్చారు. లక్నో హనీమాన్ క్రాసింగ్ సమ...
National

Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి భక్తులకు శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ ఇప్పటికే వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయోధ్య లో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధ...
Trending News

జనవరి 2024 వరకు రామ మందిరం పక్కనే అయోధ్య విమానాశ్రయం సిద్ధం

అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం జనవరి 2024 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడుతుంది మరియు అదే సమయంలో రామ మందిరంతో పాటు నిర్మాణం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Temple) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయం పక్కనే పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం (Maryada Purushottam Shri Ram Airport )పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా మొదటి కమర్షియల్ విమాన కార్యకలాపాలు జనవరి 2024లో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. "ఇదే సమయంతో పోటాపోటీగా రామ మందిర నిర్మాణంతో పాటు విమానాశ్రయం కూడా పూర్తవుతుంది" అని ఒక అధికారి చెప్పారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల ప్రకారం.. మొదటి దశలో అయోధ్య విమానాశ్రయం నుంచ...
Exit mobile version