Old City Metro Project : త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో పరుగులు.. మారనున్న రూపురేఖలు
Old City Metro Project : హైదరాబాద్లోని పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్ నగర్ డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ హైదరాబాద్.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
మెట్రో స్టేషన్లు ఎక్కడ?
మెట్రో లైన్ ఎంజీబీఎస్, దారుల్ షిఫా జంక్షన్, పురాణా హవేలీ, ఇత్తేబాద్ చౌక్, అలీ జాకోట్ల, ర్ మోమిన్ దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్ గ...