Wednesday, March 12Thank you for visiting

Tag: AP news

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రూ.6,585 కోట్ల నిధులు

Andhrapradesh
Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 384 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టుల (National Highway Projects) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6,585 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఏడు జాతీయ రహదారుల‌ ప్రాజెక్టులు ఈ  విధంగా ఉన్నాయి. కోడుమూరు-పేరిచెర్ల, సంగమేశ్వరం-నల్లకాలువ నంద్యాల-కర్నూలు, వేంపల్లి-చాగలమర్రి, గోరంట్ల-హిందూపూర్, ముద్దనూరు-బి కొత్తపల్లి, పెందుర్తి-బవర్ధ మధ్య ఉన్నాయి. National Highway Projects in Andhra Pardesh ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇతరులతో సమన్వయం చేసుకుని ఈ నిధుల సేకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని జ‌నార్ద‌న్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భారత్ మాల ప్రాజెక్ట...

జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Andhrapradesh
Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు....

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

Andhrapradesh, Telangana
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...

Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

Andhrapradesh
Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు. సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణ...

Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేష‌న్ లో హాల్టింగ్‌

Andhrapradesh
Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిల‌పాల‌ని డిమాండ్ వ‌స్తోదంఇ. ఈ క్ర‌మంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేష‌న్‌ లో ఒక నిమిషం పాటు ఆగనుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్‌.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేష‌న్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభార‌త్‌ రైలు... విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించినందు...

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Andhrapradesh
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు ద...

AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Andhrapradesh
AP Cabinet | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌తో పాటు శాంతి భ‌ద్ర‌త‌లు త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విప‌త్తు శాఖను వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet  శాఖ‌ల కేటాయింపు ఇలా.. చంద్ర‌బాబు ( ముఖ్య‌మంత్రి ) – సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌లు ప‌వ‌న్ కల్యాణ్( ఉప ముఖ్య‌మంత్రి) – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నారా లోకేశ్ – మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీ కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌ అనిత వంగ...

Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Andhrapradesh, Telangana
Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుం...

TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు

Andhrapradesh
TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్య‌మంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేక‌రుల‌కు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవ‌త్స‌రం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.10కే భోజనం TTD Board Decisions  | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమ‌తించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మాన...

Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Andhrapradesh, Telangana
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది.. తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం.. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప...
Exit mobile version