Thursday, June 19Thank you for visiting

Tag: AP news

TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..

Andhrapradesh
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది . కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్ట‌ల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామ...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..

Andhrapradesh
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యానణ్ కు సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి హత్య బెదిరింపు కాల్ (Death threat) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత వ్యక్తి ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో సందేశాలు కూడా పంపాడు. ఘటన జరిగిన వెంటనే కార్యాల‌య‌ సిబ్బంది వెంట‌నే పోలీసు అధికారులకు సమాచారం అందించారు. (more…)...

విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..

Andhrapradesh
Visakha Metro Rail | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీల‌క అప్ డేట్‌.. వచ్చింది. మెట్రో లైన్‌ నిర్మాణానికి సంబంధించిన మొద‌టి దశ డీపీఆర్‌లను చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొద‌టి విడ‌తో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది. మొద‌టి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ) రెండో కారిడార్ : గురుద్వార్‌ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్‌ వరకు (5.08కి.మీ) మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ) కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ స‌ర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి ద‌శ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యిన తర్వాత మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ...

TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..

Andhrapradesh
TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణ‌యంతో ఎంత‌ హిందూయేతర సిబ్బందిపై ప్ర‌భావం ప‌డుతుందో తెలియ‌దు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌నిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు ప్రభావితం కావచ్చు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం, TTD చట్టానికి అనుగుణంగా ఉందని ప‌లువురు టీటీడి ఉద్యోగులు చెబుతున్నారు. ఓ యూనియన్‌కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, "ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయాల‌ని కోరారు. అక్టోబర్ 31న అధికారం చేపట్టిన TTD ఛైర్మన్ నాయుడు (TTD Chairman B.R. Naidu )  దేవాలయాన్ని నడిపేంద...

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhrapradesh
Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ.. వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం. శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే.. రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...

TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

Andhrapradesh
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువ‌త‌కు మెరుగైన జీత‌భ‌త్యాలతో ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. యువ‌నేత నారా లోకేష్ (Nara Lokesh) గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా య‌త్నాలను ముమ్మ‌రం చేశారు. ఈమేర‌కు తాజాగా టాటా గ్రూపు చైర్మన్‌, సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా స‌న్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖ‌ర‌న్‌తో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో సీఎంవో అడిష‌నల్ సెక్రట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు,...

Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

Andhrapradesh
Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్క‌ర‌ను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేష‌న్‌ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబ‌ర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67ల‌కు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచ‌దార‌ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి మ‌నోహర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేద‌ల‌కు సబ్సిడీ ధ‌ర‌కు కందిప‌ప్పు చెక్క‌ర అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, బ‌య‌ట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్ర‌స్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర‌ ధర రూ.45కి పైగా ఉంది. 1 KG కందిపప్పు రూ.67 1/2 KG పంచదార రూ.17. నేటి నుంచి 1.48 కోట్...

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Andhrapradesh
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..

Andhrapradesh
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు. ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు. కల్తీని అంగీకరించిన టీటీడీ కాగా తిరుమల...
Exit mobile version