Thursday, June 19Thank you for visiting

Tag: Aarogyasri cards

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Telangana
New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు. కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్ట...

New Ration Cards | పేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో రేష‌న్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు

Telangana
New Ration Cards | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ప్ర‌క్రియకు కీల‌క‌మైన ముందడుగు ప‌డింది. రేష‌న్ కార్డుల మంజూరులో విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం (Telangana Cabinet) తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈసారి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా మంజూరు చేయ‌నున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా కొత్త రేషన్‌ ‌కార్డుల (New Ration Cards ) జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అధ్యక్షతన రేషన్‌ ‌కార్డుల జారీ విధివ...

Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..

Telangana
Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ రేషన్ కార్డులు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ త్వ‌ర‌లో షురూకానుంది. రేష‌న్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇక‌పై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను రేష‌న్ కార్డు ప్రామాణికం కాద‌ని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్ల‌డించారు. మ‌రోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రేష‌న్ కార్డు కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇక్క‌డ చూద్దాం.. కొత్త రేషన్ కార్డు...

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

Telangana
New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు. “మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ...

Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Telangana
Ration Cards  | సంక్షేమ పథకాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా రేష‌న్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌తో రేష‌న్ కార్డు లేని నిరుపేద‌లు ఏ ప‌థ‌కాన్ని కూడా పొంద‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (ప...
Exit mobile version