పారిపోయిన వధువు కోసం వరుల వేట
దాదాపు 27 మందిని వివాహం చేసుకున్న కిలేడీ
డబ్బు, బంగారంతో పరారీ
జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్లో ఓ మహిళ 27 మందిని పెళ్లి చేసుకొని వారి వద్ద నుంచి బంగారం, డబ్బు దోచుకుని పారిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రీనగర్ లాల్ చౌక్ ప్రెస్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు అవ్రత్ అనే మహిళ తమను వివాహం చేసుకుందని, ఆపై తమతో కొంతకాలం గడిపిన తర్వాత బంగారం, డబ్బుతో
పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుద్గామ్ జిల్లాలో జరిగింది. .
శ్రీనగర్ లాల్చౌక్లోని సితిత్ ప్రెస్ కాలనీలో కొందరు బాధితుల కథనం ప్రకారం.. జమ్మూ డివిజన్లోని రాజౌరి ప్రాంతానికి చెందిన మహిళ కొందరు మారేజ్ బ్రోకర్స్ తో కలిసి ముఠాగా ఏర్ప్డడ్డారు. సాధారణంగా ధనవంతులు లేదా పెద్ద మోత్తంలో కట్నాలు ఇచ్చేవారిని టార్గెట్ చేశారు. బద్గామ్ ఖాన్ సాహెబ్ ప్రాంతానికి చెందిన బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఒ...