Pulwama attack | పుల్వామా బ్లాక్ డే : బాలాకోట్ వైమానిక దాడితో భారతదేశం ఎలా ప్రతీకారం తీర్చుకుంది?
Six Years Of Pulwama attack : ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ-శ్రీనగర్ (Jammu to Srinagar Balakot) జాతీయ రహదారిపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) కాన్వాయ్ కదులుతుండగా, పుల్వామా (Pulwama Attack ) వద్ద ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జవాన్ల బస్సులలో ఒకదానిపైకి ఢీకొట్టాడు. అవంతిపోరాలోని గోరిపోరాలో జరిగిన విధ్వంసకర దాడిలో 40 మంది CRPF సిబ్బంది వీర మరణం పొందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు యావత్ దేశం సంతాపం తెలిపింది, అయితే దెబ్బకు దెబ్బ తీయాలని సగటు ప్రతీ బారతీయుడు కోరుకున్నారు.
Pulwama attack : బాలాకోట్ వైమానిక దాడితో ప్రతికారం..
2019 Pulwama attack Black Day : పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత ...