Wednesday, June 18Thank you for visiting

రూ.130 కోట్ల‌తో అభివృద్ధి చేసిన‌ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్ల పని ఏంటి?

Spread the love

Param Rudra Supercomputers | వాతావరణ మార్పుల‌పై పరిశోధనల కోసం మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సిస్టమ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సూపర్ కంప్యూటర్‌లను భారతదేశంలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద అభివృద్ధి చేశారు. ఈ మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌ల త‌యారీకి సుమారుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు.అధిక-పనితీరు గల సైంటిఫిక్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌కు స‌హ‌క‌రించేందుకు పూణె, ఢిల్లీ, కోల్‌కతాలో వీటిని మోహ‌రిస్తారు. వర్చువల్ ఈవెంట్ లో ఈ సూప‌ర్ కంప్యూట‌ర్‌ల‌ను మోదీ ప్రారంభించారు. తన ప్రసంగంలో దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యం ప్రాముఖ్యతను ప్రధాని వెల్ల‌డించారు.

“పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు, హెచ్‌పిసి సిస్టమ్‌తో, భారతదేశం కంప్యూటింగ్‌లో స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తోంది. డిజిటల్ విప్లవ యుగంలో, కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి పర్యాయపదంగా మారుతోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. వాతావరణ పరిశోధనలకు అనుగుణంగా రూపొందించబడిన ‘అర్కా’ మరియు ‘అరుణిక’ అనే హై ప‌ర్ ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌లను ప్రారంభించారు. వీటి అభివృద్ధిలో పాల్గొన్న శాస్త్రవేత్తలు పరిశోధకులతో సంభాషించారు. ప్రారంభోత్సవంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.

దేశంలోనిమూడు కీల‌క‌మైన ప్రదేశాల్లో ఈ సూపర్ కంప్యూటర్ల ( Param Rudra supercomputers ) ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని సూపర్ కంప్యూటర్ ఇంటర్-యూనివర్శిటీ యాక్సిలరేటర్ సెంటర్ (IUAC)లో ఇన్‌స్టాల్ చేశారు. ఇక్కడ ఇది మెటీరియల్ సైన్స్, అటామిక్ ఫిజిక్స్‌లో పరిశోధనలకు మద్దతు ఇస్తుంది. పూణేలో, ఇది ఫాస్ట్ రేడియో బర్స్ట్‌లు (FRBలు), ఇతర ఖగోళ దృగ్విషయాలనుఅధ్యయనం చేయడానికి జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (GMRT)తో పాటు ఉపయోగించనున్నారు. ఇక మూడ‌వ‌ది కోల్‌కతాలో, ఈ వ్యవస్థ SN బోస్ సెంటర్‌లో ఉంది. ఇది భౌతిక శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం, భూ శాస్త్రాలలో పరిశోధనను అభివృద్ధి చేయడానికి ఉపయోగించనున్నారు.

ఈ ప్రయోగం భారతదేశం యొక్క సాంకేతిక మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ పరిశోధనలను మెరుగుపరచడానికి పెద్ద ప్రయత్నంగా చెప్ప‌వ‌చ్చు. స్పేస్ సైన్స్, క్లైమేట్ స్టడీస్, ఫిజిక్స్ వంటి రంగాలలో పురోగతి సాధించడంలో పరిశోధకులకు సహాయం చేయడంలో సూపర్ కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశం తన సూపర్‌కంప్యూటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా, స్టార్టప్‌లతో సహా అకాడెమియా, పరిశోధన, పరిశ్రమల వంటి రంగాలలో అధునాతన సాంకేతికత కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనుంది, జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ 2019లో IIT (BHU)లో ఇన్‌స్టాల్ చేయబడిన భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ సూపర్‌కంప్యూటర్ అయిన PARAM శివయ్‌ను ప్రారంభించడం ద్వారా ప్ర‌పంచ‌ దృష్టిని ఆకర్షించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version