Friday, March 14Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi

National
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM M...

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

National
ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు తెలుసుకోండి

National
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లో ఫుల్లీ ఎయిర్కండిషన్డ్ ఉంటుంది. వందే భారత్ రైలు మొదట జనవరి 17, 2019న ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఉచిత వైఫై కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, సూపర్ కంఫర్టబుల్ సీట్లు, పరిశుభ్రమైన భోజనం వంటి అనేక సౌకర్యాలు, ఫీచర్లతో ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి, మొత్తం సంఖ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 23కి చేరుకుంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లిస్ట్ చూడండి.. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎ...

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

National
మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం 'సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు. "మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు" అని శర్మ చెప్పారు. "ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్...

ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..

National
తెలంగాణలో 21, ఏపీలో 18, రైల్వేస్టేషన్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన ప్రధాని దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పథకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆదివారం వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ రైల్వే రంగంలో ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఎంపిక దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పునరాభివృద్ధి కోసం 508 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశరు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. ఇక ...

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన

National
తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. "ఇంత భారీ సంఖ్యలో స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని, కాబట్టి ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది" అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 2025 నాటికి ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రాజెక్ట్ పురోగతిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరిచింది. ఈ రైల్వే స్టేషన్ల పురోగతిని ప్రధాని వ్యక్తిగతంగా ప...

కేరళలో అంతుచిక్కని వ్యాధి.. రక్తపు వాంతులతో ఐదుగురు మహిళలు మృతి

National
కేరళలో మరో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. ఐదుగురు వృద్ధ మహిళలు పాదాల కింద బొబ్బలు పెరగడంతోపాటు రక్తపు వాంతులతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడడం షాక్ గురిచేసింది. కేరళలోని మువట్టుపుజా(Muvattupuzha)లోని స్నేహవీడు(Snehaveedu) అనే వృద్ధాశ్రమంలో రెండు వారాల వ్యవధిలో ఒక అంతుచిక్కని చర్మ వ్యాధి ఐదుగురు వృద్ధ మహిళలను బలిదీసుకుంది. స్నేహం ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Sneham Charitable and Educational Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మహిళల మరణానికి ముందు ఇలాంటి లక్షణాలను కనిపించినట్లు స్థానికులు తెలపిారు. వారు వారి పాదాల కింద వాపు, బొబ్బలు వచ్చాయి. అది చివరికి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. వారి చర్మం ఊడిపోయినట్ల కనిపించింది. తర్వాత వీరంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. ఇవే లక్షణాలు కనిపించిన మరో ఆరుగురు బాధితులను మువట్టుపుజా జనరల్ ఆసుపత్రిలో ...

జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

National, Trending News
జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. "జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది" అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు. జూలై 27న ఏఎస్...

దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ

National
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను "నకిలీ"వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఈ విషయమై యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. “యూజీసీ (University Grants Commission ) నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య కోసం గానీ, ఉద్యోగాల్లో అవకాశాల కోసం గానీ చెల్లుబాటు కావు. ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీని అందించే అధికారం లేదు’’ అని తెలిపారు. ఢిల్లీలో ఎనిమిది "నకిలీ" విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (All India Institute of Public and Physical Health Sciences); కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యా...
Exit mobile version