Saturday, March 15Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత

National
Rakhi Festival : రక్షా బంధన్, లేదా రాఖీ పర్వదినం తోబుట్టువుల మధ్య అనుబంధాలకు ప్రతీక. ఈ పండుగ ఏటా శ్రావణ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) రోజున వస్తుంది. ఈ పర్వదినాన సోదరులు, సోదరీమణులు ప్రత్యేక పూజలు చేసి సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి, వారి నుదుటిపై తిలకం వేసి, వారి శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు అన్ని కాలాల్లో రక్షణగా నిలుస్తారని భావిస్తారు. వారికి కానుకలను అందజేస్తారు. అయితే ఇటీవల కాలంలో సోదరీమణులు కూడా ఒకరికొకరు మణికట్టుకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు. రక్షాబంధన్ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేదా 31? What Is Rakhi Festival: దేశ ప్రజలు రాఖీ పర్వదినాన్ని జరుపునే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సంవత్సరం రాఖీ రోజున తోబుట్టువులంతా వారి అన్నాదముళ్లకు ఎలాంటి రాఖీలు కట్టాలనే విషయమై పలు రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. కానీ ఈసారి రక్షబంధన్ విషయంలో ఓ చి...

నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..

National
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠినమైన చర్యలను తీసుకుంటోంది. పోలీసు అనుమతి నిరాకరించినప్పటికీ, విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నందున పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్ 144 విధించింది. నుహ్ జిల్లాలో ఎక్కడా గుమిగూడొద్దని ప్రజలను కోరింది. సెక్షన్ 144 విధింపు నుహ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అశ్విని కుమార్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు ప్రకటించారు. శోభాయాత్రకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బ్యాంకులను మూసి వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. యాత్రను ప్రచారం చేసేవారు సెక్...

మణిపూర్ : మూడు ఇళ్లను దగ్గం చేసి, భద్రతా దళాల ఆయుధాలను లాక్కెళ్లిన దుండగులు

National
  manipur violence : మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ పలుచోట్ల అవాంఛిత ఘటనలు చోటుచేసుకుంటుననాయి. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మూడు పాడుబడిన ఇళ్లను తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే, స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు., ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని డిమాండ్ చేయగా, రాష్ట్ర, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. తరువాత భద్రతా దళాలు గుంపును చెదరగొట్టడానికి కొన్ని రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి : మణిపూర్ అసలు చరిత్ర ఏమిటో మీకు తెలుసా..? మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు మాజీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె...

కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

National
WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ WHAP వాహనానికి (Wheeled Armored Amphibious Platform ) భూమి, నీరు, అలాగే చిత్తడి నేలలు, సరస్సులు, మడుగులపై  నుంచి కూడా ప్రయాణించే సత్తా కలిగి ఉంటుంది. ఈ వాహనాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), TATA సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్‌తో సహా 12 మంది సైనికులను తీసుకెళ్లవచ్చు. బాంబు పేలుళ్లు, బులెట్ల వర్షాన్ని తట్టుకునే సత్తా.. 'వీల్డ్ ఆర్మర్డ్ యాంఫిబియస్ ప్లాట్‌ఫాం' (WHAP) బుల్లెట్ల వర్షం, బాంబు పేలుళ్లు, రాకెట్‌లను సైతం తట్టుకోగల ఒక బలిష్టమైన యంత్రం. ఇది శక్తివంతమైన 600-హార్స్పవర్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అలాగే ఖచ్చితమైన షూటింగ్ కోసం 7.62 mm రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ (RCWS...

Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !

National
Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ రోజు సాయంత్రం 5:27 నుండి కింది వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి ISRO వెబ్‌సైట్: ఇక్కడ క్లిక్ చేయండి https://isro.gov.in ISRO అధికారిక YouTube ఛానెల్:   https://youtube.com/watch?v=DLA_64yz8Ss • ISRO అధికారిక Facebook ఛానెల్:   https://facebook.com/ISRO • DD నేషనల్ టీవీ • టీవీ ఛానెల్‌...

Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..

National
Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ...

మరిన్ని సౌకర్యాలతో కొత్త ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు..

National
Orange Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనగానే తెలుపు-నీలిరంగు బోగీలు గుర్తుకొస్తాయి. అయితే.. భారతీయ రైల్వే కొత్తగా నారింజ తెలుపు రంగుతో.. కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా  వివిధ మార్గాల్లో నడిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా అడుగు వేస్తూ ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.  చెన్నైలోని  ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)  తయారు చేసిన ఈ కొత్త రేక్‌ను ట్రయల్ రన్ కు  ముందుగా  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ ను ICE, పాడి రైల్వే ఫ్లైఓవర్ మధ్య రూట్ లో నిర్వహించారు.. ఐసీఎఫ్‌ రూపొందించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇది 33వ రేక్‌ కావడం గమనార్హం.  ఈ రైలులో రంగుతోపాటు అనే కొత్త ఫీచర్లను జోడించారు. దీంతో ప్రయాణికులు ఇంతకుముందు కంటే మరిన్ని సౌకర్యాలు పొందనున్నారు. అవేంటంటే..? వ...

ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి

National
లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో  ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో  మరో అధికారి గాయపడినట్లు వార్త సంస్థ ANI నివేదించింది. మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారు. ట్రక్కు కరూ గ్యారీసన్ నుండి లెహ్ సమీపంలోని క్యారీకి వెళుతుండగా క్యారీ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయలో పడిపోయింది. ఇది మొత్తం 34 మంది సిబ్బందితో ఒక SUV,  అంబులెన్స్‌తో సహా దళంలో భాగం. మూడు వాహనాలు రెక్సే పార్టీ (recce party) నిర్వహణ లో ఉన్నాయి. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ సంతాపం సైనికుల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Ra...

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాగ్ పూర్ లో రైలు నిలిపివేత

National
ముంబై: సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును నాగ్ పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముంబై-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు ముంబై-బె...

5% వడ్డీతో రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?

National
  PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్ లోనూ మద్దతునిచ్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలానికి రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి ‘విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే..కాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాక...
Exit mobile version