Saturday, March 15Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

ఉచితంగా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కావాలా? అయితే Airtel, Jio, Vi వినియోగదారులు ఇలా చేయండి?

National
Free JioHotstar Subscription Plans : రిలయన్స్, హాట్ స్టార్ కలిసి జియో హాట్‌స్టార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లోని అపరిమితమైన కంటెంట్ లైబ్రరీలను ఒకే వేదికపై ఇపుడు జియో హాట్ స్టార్ (JioHotstar ) స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విక్షించవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం ఆపరేటర్లు.. జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా తాజాగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ వినియోగదారు అయినా, సరే సరసమైన డేటా ప్యాక్‌ల నుంచి అనేక OTT ప్రయోజనాలతో కూడిన హై-ఎండ్ ప్లాన్‌ల వరకు, అందరికీ అనుకూలమైన రీచార్జి ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, విఐ అంతటా అందుబాటులో ఉన్న తాజా జియో హాట్‌స్టార్ ప్లాన్‌ల ధర, చెల్లుబాటు, అదనపు ప్రయోజనాల వంటి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.. రిల...

Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను బిజెపి ఎందుకు ఎంచుకుంది?

National
Delhi CM Rekha Guptha | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసి భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంపికను కొంద‌రు ఊహించిన‌ప్ప‌టికీ రేఖా గుప్తా రాజకీయ ప్రయాణం, పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమె ఎందుకు స‌రైన ఎంపికో స్పష్టమవుతుంది. రేఖ గుప్తా దశాబ్దాలుగా బిజెపి, దాని సైద్ధాంతిక మూలాలను ఎన్న‌డూ విడిచిపెట్ట‌లేదు. సంఘ్ పరివార్ తో ఆమె కుటుంబానికి ఉన్న దీర్ఘకాల అనుబంధం ఆమె రాజకీయ జీవితాన్ని నిర్మించ‌డంలో కీలక పాత్ర పోషించింది. ఆమె 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు, ఇది ఆమె నాయకత్వ ప్రయాణానికి నాంది పలికింది. విద్యార్థి రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి రేఖా గుప్తా నాయకత్వంలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. 1995లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) కార్యదర్శిగా ఆమె పనిచేశా...

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

National
Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానా...

Metro Rail | మార్చి నాటికి 3 హైదరాబాద్ మెట్రో కొత్త కారిడార్లకు డీపీఆర్‌లు

National
Hyderabad Metro Rail : శామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ల వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) మార్చి చివరి నాటికి సిద్దమవుతాయని , కేంద్ర ఆమోదం కోసం సమర్పించబడతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ MD NVS రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో 'గ్రీన్ క్రూసేడర్స్' కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిర్వహించిన 'గ్రీన్ తెలంగాణ సమ్మిట్- 2025'లో ప్రసంగించిన రెడ్డి, హైదరాబాద్‌లోని నాలుగు దిశలలో మెట్రో రైలు నడపాలనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రణాళికలకు అనుగుణంగా HMRL పనిచేస్తోందని అన్నారు. Metro Rail విస్తరణలో మారానున్న నగర రూపురేఖలు కొత్త మెట్రో కారిడార్లు హైదరాబాద్ భౌతిక రూపురేఖలను మారుస్తాయని హామీ ఇస్తూ, హైదరాబాద్ త్వరలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని అన్నారు. పాత బస్తీ (old city) లోని హైదరాబాద్ మెట్రో దారుల్ షిఫా - పురానీ హవేలి మీదుగ...

Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..

Life Style, National
Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధిలో, రోగి తన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కొంతమంది తెలియకుండానే కొన్ని ఆహారాలను తీసుకుంటారు, ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతాయి, ఇది మధుమేహానికి చాలా హానికరం అని తేలింది. ఈ నేపథ్యంలో మీరు పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. డయాబెటిస్ (Avoid Foods in Diabetes) సమయంలో మీరు ఏ విషయాలకు దూరంగా ఉండాలో ఒకసారి లుక్కేయండి.. Avoid Foods in Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి....

Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు

National
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ చేశారనే ఆరోపణలతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని విపిన్ జైన్, పొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. సిట్ దర్యాప్తులో నెయ్యి సరఫరాలో ప్రతి దశలోనూ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్లు వెల్లడైందని, దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.వైష్ణవి డెయిరీ అధికారులు ఆలయానికి నెయ్యి సరఫరా చేయడానికి ఏఆర్ డెయిరీ పేరుతో టెండర్లను పొందారని, టెండర్ ప్రక్రియను తారుమారు చేయడానికి నకిలీ రికార్డులను సృష్టించారని తెలిపారు. వైష్ణవి డెయిరీ భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యిని సేకరించినట్లు తప్పుగా చెప్పిందని సిట్ బయటపెట...

local trains | స‌రికొత్త‌ ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్‌లు

National
Mumbai local trains : భార‌త‌దేశంలో అత్య‌ధిక జ‌నాభా గ‌ల న‌గ‌ర‌మైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ముంబై ప్రయాణికులకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నగ‌రంలో రద్దీని తగ్గించడంతోపాటు మెరుగైన లక్షణాలతో కూడిన కొత్త-డిజైన్ రైళ్లను ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ(Mumbai suburban railway system ) లో త్వరలో చేర్చ‌నున్న‌ట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) ప్రకటించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే లైన్లలో ప్రస్తుతం రూ.16,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వైష్ణవ్ పేర్కొన్నారు. రెండు స్థానిక రైళ్ల మధ్య సమయ అంతరాన్ని ప్రస్తుతం 180 సెకన్లుగా తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హైలైట్ చేశారు. ప్రయాణికుల‌ రద్దీని తగ్గించడానికి సేవల ఫ్రీక్వెన్సీని పెంచడా...

Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం

National
Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కుల‌గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Re...

Bangladesh-India | భారతదేశం మాల్దీవులకు సహాయం పెంపు.. బంగ్లాదేశ్ భార‌త్ ఏంచేసింది?

National
Budget 2025 : కేంద్ర బడ్జెట్‌లో విదేశీ సహాయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ. 5,483 కోట్లు కేటాయించింది, ఇది గతేడాది రూ.4,883 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో, నైబర్‌హుడ్ ఫస్ట్, లుక్ ఈస్ట్ విధానాలను భారతదేశ సహాయ ప్రాధాన్యతలను కొన‌సాగించిన‌ట్లు కనిపిస్తోంది. మొత్తం స్కీమ్ పోర్ట్‌ఫోలియోలో 64% (రూ. 4,320 కోట్లు) జలవిద్యుత్ ప్లాంట్లు, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, హౌసింగ్, రోడ్లు, వంతెనలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా వివిధ కార్యక్రమాల కోసం దాని తక్షణ పొరుగు దేశాలకు కేటాయించింది. భూటాన్ కు భారీగా సాయం Bhutan-India : 2025-26కి 2,150 కోట్ల కేటాయింపుతో ఈసారి భూటాన్ భార‌త్ నుంచి అత్య‌ధిక‌సాయం పొందుతున్న దేశాల్లో ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. గత ఏడాది 2,068 కోట్లు సాయం అందించింది. విదేశీ సహాయాన్ని స్వీకరించడంలో భూటాన్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశం భూటాన్‌ల కీలక అభ...

Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

National
Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు. మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివ‌రాలు వెల్ల‌డించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వం తాత్కాలిక మహా కుంభ్ నగరం...
Exit mobile version