
Toll Tax | రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము (రేట్లు ) నియమాలను సవరించింది. జీపీఎస్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేయాలని నిర్ణయించింది
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము నియమాలను సవరించింది. ఇది ప్రైవేట్ వాహన యజమానులకు మేలు చేకూరుస్తుంది. జాతీయ రహదారుల రుసుము ( Determination of Rates and Collection ) సవరణ నియమాలు – 2024 ప్రకారం, ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని కలిగి ఉన్న ప్రైవేట్ వాహన యజమానులు కొత్త టోల్ విధానం ద్వారా ప్రయోజనం పొందుతారు.
కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రైవేట్ వాహన యజమానులు తమ వాహనాలు GNSS కలిగి ఉంటే, హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఎటువంటి Toll Tax ఛార్జీలు ఉండవు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు, వారు ప్రయాణించిన దూరం ఆధారంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఉన్న ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా GNSS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ను ప్రారంభించనున్నట్లు రహదారి మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. కర్ణాటకలోని NH-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని NH-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో ఈ వ్యవస్థ కోసం పైలట్ అధ్యయనం నిర్వహించినట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..