Saturday, March 15Thank you for visiting

Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. నేడే షెడ్యూల్ విడుదల

Spread the love

Maharashtra and Jharkhand Assembly Elections | భారత ఎన్నికల సంఘం (Election Commission) ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూత్ తోపాటు కేరళలోని వాయనాడ్‌తో సహా మూడు లోక్‌సభలకు, వివిధ‌ రాష్ట్రాలలో కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. .

కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఈ వేసవి లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి గెలుపొంద‌గా, కేర‌ళ‌ వయనాడ్ స్థానాన్నివ‌దులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎంపీగా కొన‌సాగుతున్నారు. అలాగే నాందేడ్ (మహారాష్ట్ర), బసిర్హట్ (పశ్చిమ బెంగాల్) రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 26, జనవరి 5న అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తోంది. హర్యానాలో రికార్డు స్థాయిలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మంచి ఊపు మీద ఉంది. ఇటీవ‌లే జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానాలో ఎన్నికలు జరిగాయి, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది.

హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ, బిజెపి అధికార వ్యతిరేకతను అధిగమించి తన అత్యధిక ఓట్ షేర్ తో 90 సీట్లలో 48 సీట్లను కైవ‌సం చేసుకుంది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో హర్యానాలో జరిగిన 10 సీట్ల‌లో ఐదింటిని గెలుచుకున్న కాంగ్రెస్.. అదే ఊపును కొన‌సాగించ‌లేక‌పోయింది. ఇక మహారాష్ట్ర‌లో లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లలో 13 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. బిజెపి, శివసేన (యుబిటి) చెరో తొమ్మిది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్ (ఎన్‌సిపిఎస్‌పి) ఎనిమిది, శివసేన 7, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఒకటి, స్వతంత్ర ఒకటి గెలుచుకున్నాయి.

మహారాష్ట్రలో ఎన్నికలు

2019లో 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 21న ఒకే దశ పోలింగ్ జ‌రిగింది. బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సాధించింది, అయితే ముఖ్యమంత్రి పదవిపై విభేదాల కారణంగా పొత్తు ముగిసింది. నవంబర్ 23, 2019న బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్ డిప్యూటీగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. బలపరీక్షకు మూడు రోజుల ముందు ఇద్దరూ రాజీనామా చేశారు.

నవంబర్ 28, 2019న, ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో భాగంగా శివసేన, NCP, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, జూన్ 29, 2022న థాకరే రాజీనామా చేశారు. అనంతరం షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేశారు.

2019లో జార్ఖండ్ లో ఫలితాలు ఇలా..

ఇక జార్ఖండ్ విష‌యానికొస్తే.. 2019లో, 81 మంది సభ్యులున్న‌ జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 23న ఫలితాలు ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని కూటమి 47 స్థానాలతో విజేతగా నిలిచింది. బీజేపీ 25 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ వేసవిలో లోక్‌సభలోని 14 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుని బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేఎంఎం మూడు, మిత్రపక్షం కాంగ్రెస్‌ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మిగిలిన లోక్‌సభ స్థానాన్ని ఏజేఎస్‌యూ పార్టీ గెలుచుకుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version