Friday, March 14Thank you for visiting

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్

Spread the love

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇందుకోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రూ.135 కోట్లు ఖర్చు అవుతుంది.
ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన బాలికలకు మాత్రమే ఈ-బైక్‌లను మొదట ప్రకటించింది. అయితే ఆ తర్వాత బాలురకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

“ఇ-స్కూటీ విద్యార్థులను వారి ఇళ్ల నుంచి కళాశాలలకు వచ్చిపోయేందుకు వీలుగా ఉంటుందని మిశ్రా తెలిపారు. దీంతో పాటు, SC / ST విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఆమోదించబడింది ”అని చెప్పారు.

కమల్ నాథ్ కౌంటర్

అయితే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఈ నిర్ణయాన్ని “డ్రామా” అని విమర్శించారు. “ఎన్నికల కోసం హెలికాప్టర్ కూడా ఇస్తామని బీజేపీ ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు.. నాకు వారిపై పూర్తి విశ్వాసం ఉంది. ప్రకటనలలో నేను శివరాజ్ సింగ్‌ను ఓడించలేకపోవచ్చు, కానీ వాస్తవానికి నేను అతనిని ఓడించగలను” అని కమల్ నాథ్ అన్నారు.

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

వివిధ శాఖల్లోని అధికారుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. జూన్ 15 నుంచి బదిలీలు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు కోఆపరేటివ్ పాలసీ 2023కి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ప్రాంతాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించామని, సహకార సంఘాల సాధికారత కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కొత్త ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా సమావేశంలో ఆమోదం లభించింది. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో సింగ్రౌలీలో కొత్త ఎయిర్‌స్ట్రిప్ నిర్మించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version