Wednesday, April 16Welcome to Vandebhaarath

Local

వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..
Local

వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదా...
Andhrapradesh, Local

అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు. అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగా...
Local

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...
Local

కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి

‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై ‘కుడా’ చైర్మన్ హనుమకొండ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ‘కూడా’ వైస్ చైర్మన్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని అన్నారు. కాళోజీ కాలక్షేత్రం లో ఆర్ట్ గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళోజీ రచనలు, సాహిత్యం, జీవిత చరిత్ర, పరిశోధనలు, ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, డాక్యుమెంటరీలే అన్నీ ఈ ఆర్ట్ గ్యాలరీ లో ఉండాలి అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సీ...
Local

భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభం వరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి...
Andhrapradesh, Local

ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు. ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథ సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆ...
Local

కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు

కోలాహలంగా అమ్మవారి రథయాత్ర కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు కల్యాణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రతీ రోజు అమ్మవా రికి ప్ర త్యేక పూజలు, హో మాలు, కుంకు మ పూజ లు నిర్వహించా రు. అమ్మవా రు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీ లోని భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై అమ్మవారి ని దర్శించుకొ ని మొక్కు లు చెల్లించుకున్నా రు. కోలాటాలతో సందడి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం నిమిషాంబదేవి అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేతో భక్తి పాటలతో కాలనీ హోరెత్తిపోయింది. కాలనీలోని మహిళలందరూ కోలాటలాలతో నృత్యాలు చేసి కనువిందు చేశారు. అమ్మవారి రథయాత్ర కాలనీలో ప్రధానవీధుల మీదుగా సందడిగా సాగింది....
Local

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేష్‌, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner   అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రగతిని అంచనా వేసి ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించాలని ఆయన సంకల్పించారు. రిజ్వాన్‌బాషా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రవిణ్య GWMC FAC కమిషనర్‌గా ఆమె బాధ్యతల నుండి తప్పించారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రిజ్వాన్‌బాషా గతంలో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థాని...
Local

కుక్క కరిచిన గేదె పాల అమ్మకం

 ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని గేదె యజమాని నాన్నయ్య.. ఆందోళన చెందాడు. అందుకే ఆ విషయాన్ని దాచి యథావిధిగా ఊరంతటికీ పాలు అమ్మాడు. అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో...
Local

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల క‌ళ‌క‌ళ‌

electric double decker buses : హైద‌రాబాద్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు సంద‌డి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వ‌స్తున్న డిమాండ్ ఎట్ట‌కేల‌కు నెర‌వేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్య‌క్తి ట్విట్టర్‌లో గ‌త రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా అని చ‌ర్చించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండేళ్ల తర్వాత మంగళవారం కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి మొదటి మూడు డ‌బుల్ డెక్క‌ర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ABB FIA...
Exit mobile version