Monday, March 3Thank you for visiting

Karolina Goswami | యూట్యూబర్ కరోనా గోస్వామికి బెదిరింపులు..

Spread the love

Karolina Goswami | భారతదేశానికి చెందిన యూట్యూబర్ కరోలినా గోస్వామిపై ధృవ్ రాథీ అనుచ‌రులు దాడి చేసి బెదిరించారని ఆరోపించిన తర్వాత ఆమె భారతదేశంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కలిసి నడుస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేసింది. “మేము దేనికీ భయపడము. మేము భారతదేశంలోనే ఉంటాం.. ”అని పేర్కొంటూ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక‌ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

కరోలినా గోస్వామికి గ‌త‌ మే నెలలో ధ్రువ్ రాథీ అభిమానుల నుంచి 220కి పైగా బెదిరింపులు వచ్చాయి. రాథీ యూట్యూబ్ వీడియోలకు ఆమె కౌంట‌ర్ ఇచ్చిన తర్వాత బెదిరింపులు వచ్చాయి, అతడి “భారత వ్యతిరేక ప్రచారాన్ని” బయటపెడతానని ఆమె పేర్కొంది.

క‌రోలినా గోస్వామి తన స్వంత యూట్యూబ్ ఛానెల్ “ఇండియా ఇన్ డిటైల్స్”లో పోస్ట్ చేసిన వీడియోలలో నకిలీ వార్తలను ప్రచురిస్తున్న ధ్రువ్ రాథీని, అతని సోషల్ మీడియా ఛానెళ్ల‌ను నిషేధించాలని కోరారు. దీంతో ధృవ్ రాథీ అభిమానులు గోస్వామిని, ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేయడం ప్రారంభించారు.

గోస్వామి (Karolina Goswami), ఆమె భర్తను గత సంవత్సరం జర్మనీలో రాథీ అభిమానులు దాడి చేశార‌ని పేర్కొన్నారు. ఈ అభిమానులు 2023లో దాడి సమయంలో వారి కారును ధ్వంసం చేసి, వారి పరికరాలను తీసుకెళ్లారు. అందుకే  “మేము భారతదేశంలో నివసించడం కొనసాగిస్తాము ” అని యూట్యూబర్ క‌రోలినా గోస్వామి రెండు రోజుల క్రితం వీడియ‌ను షేర్ చేశారు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version