Saturday, March 1Thank you for visiting

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Spread the love

Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది జూన్ 2018 వరకు కొనసాగింది.

సునీల్ శర్మ ఎన్నికతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బిజెపి, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 47 ఏళ్ల శర్మ.. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుంచి స్వల్ప తేడాతో గెలుపొంది, అసెంబ్లీకి రెండవసారి ఎన్నికయ్యారు.

నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన తన సమీప ప్రత్యర్థి పూజా ఠాకూర్, జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) సిట్టింగ్ చైర్‌పర్సన్ కిష్త్వార్‌పై ఆయ‌న పోటీ పడ్డారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం, సునీల్ శర్మ 1,546 ఓట్లతో పూజా ఠాకూర్‌పై పెద్దర్-నాగ్సేని స్థానంలో విజ‌యం సాధించారు. సునీల్ శర్మ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కిష్త్వార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అతను సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే రవాణా, స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

సునీల్ శర్మ 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి ఎలాంటి పెండింగ్ క్రిమినల్ కేసులు లేకుండా క్లీన్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఘనత కూడా ఆయనకు ఉంది. శర్మ బిజెపి కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర నాయకులు ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు, అక్కడ షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, “అతన్ని ఎమ్మెల్యేని చేయండి, మేము అతడికి పూర్తిగా మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని హామీ ఇచ్చారు. సునీల్ శ‌ర్మ అఫిడవిట్ ప్రకారం, అత‌ని మొత్తం నికర విలువ ₹ 3.7 కోట్లు, ఇందులో ₹ 68.7 లక్షల చరాస్తులు, ₹ 3 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి, అప్పులు ₹ 3.1 లక్షలు. ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి తమ నాయకుడు నరీందర్ సింగ్‌ను అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.

 

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version