
Operation Keller: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా, మంగళవారం (మే 13) షోపియన్ జిల్లాలోని దట్టమైన కెల్లర్ అటవీ ప్రాంతంలో జరిగిన హై-స్కేట్ ఎన్కౌంటర్లో భారత సైన్యం ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులను హతమార్చింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు “ఆపరేషన్ కెల్లర్” అనే కోడ్నేమ్ ఉన్న ఈ మిషన్ ప్రారంభించబడింది.
ఖచ్చితమైన నిఘా సమాచారం అందడంతో వెంటనే చర్య తీసుకున్న రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించాయి. బలగాలు లోపలికి వెళ్లి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో, ఉగ్రవాదుల నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో భీకర కాల్పులకు దారితీసింది. సుదీర్ఘమైన కాల్పుల తర్వాత, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. భద్రతా దళాలు తరువాత అటవీ ప్రాంతం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.
OPERATION KELLER
On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 13, 2025
ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిని అనంత్నాగ్కు చెందిన హుస్సేన్ థోకర్, మరో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.వారు అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, హసీం ముసా, అలియాస్ సులేమాన్ లు గా గుర్తించారు. ఈ ముగ్గురూ పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. వీరు ఈ ప్రాంతంలో అనేక ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ప్రారంభించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.