Thursday, June 19Thank you for visiting

Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

Spread the love

Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు, రోడ్లు – భవనాలు (R&B) శాఖ నిర్వహించే రోడ్లు, పంచాయతీ రాజ్ (PR) శాఖ పర్యవేక్షించే గ్రామీణ రహదారులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిదశలో రూ.28,000 కోట్ల అంచనా వ్యయంతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

HAM నమూనా అంటే ఏమిటి?

బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని కవర్ చేస్తారు. . అయితే రాజకీయపరమైన చిక్కులు, ప్రజల నుంచి ప్రతిఘటనల కారణంగా తమ పెట్టుబడులను తిరిగి పొందేందుకు ప్రైవేట్ డెవలపర్‌లు టోల్ ఛార్జీలు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు. అందుకు బదులుగా, ప్రభుత్వం ఒక దశాబ్దంలో డెవలపర్‌లకు తిరిగి చెల్లిస్తుంది, ఆ సమయంలో వారు రోడ్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

R&B శాఖ 3,152 కి.మీ రాష్ట్ర రహదారులతో సహా 24,245 కి.మీ రోడ్లను నిర్వహిస్తోంది. అలాగే, పంచాయత్ రాజ్ శాఖ 68,539 కి.మీ విస్తరించి ఉన్న గ్రామీణ రహదారి నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ గ్రామీణ రహదారులలో దాదాపు సగం వరకు శిథిలమైపోయాయి. 30 మెట్రిక్ టన్నుల వరకు భారీ ట్రాఫిక్ లోడ్‌లను తట్టుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు. 2024 నుంచి 2028 మధ్య షెడ్యూల్ చేసిన గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ లను దశలవారీగా అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి,

2024-25లో 5,000 కిలోమీటర్లు, 2025-26లో మరో 4,000 కిలోమీటర్లు, మరో 5,000 కిలోమీటర్లు, 2026-2026లో మరో 5,000 కిలోమీటర్లు. 2027-28 లో 3,300 కిలోమీటర్లు రహదారులను నిర్మించనున్నారు.

జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇటీవలి వరదల కారణంగా సంభవించిన తీవ్ర నష్టానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ విధానం వల్ల రోడ్లు భారీ వాహనాలకు రాకపోకలకు తట్టుకునేలా ఉండడంతోపాటు ఏడాది పొడవునా మరమ్మతులు జరిగేలా చూడవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. గ్రామాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 2028 నాటికి సమగ్ర గ్రామీణ కనెక్టివిటీని సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

నాలుగేళ్లలో గ్రామాలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర రహదారులపై కొత్త రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడానికి సమగ్ర రూ.28,000 కోట్లు వెచ్చించాలని నెలల క్రితమే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ప్రైవేట్ పెట్టుబడులతో దశలవారీగా అమలు చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను జిల్లా, రాష్ట్ర కేంద్రాలకు డబుల్, నాలుగు-లేన్ రోడ్ల ద్వారా అనుసంధానించనున్నారు.

తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ఏ పీపీపీ మోడల్‌ను అనుసరించాలో ఖరారు చేసేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్‌కమిటీ హెచ్‌ఏఎం మోడల్‌ను అనుసరించాలని సిఫారసు చేసి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నెలాఖరులోగా జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆమోదం పొందే చాన్స్ ఉంది. ఆమోదం పొందితే, టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు అప్పంగిస్తారు. ఫిబ్రవరి 2025 నాటికి పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. .


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version