Wednesday, June 18Thank you for visiting

Etela Rajender | ఎక్కడికి రావాలో చెప్పండి.. రేవంత్ రెడ్డి సవాల్‌కు ఈటల సై

Spread the love

Etela Rajender Fires on CM Revanth Reddy | హామీల చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని బిజెపి నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.  హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ అవసరంలేదని, ఎక్కడికి రావాలో చెబితే వచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామని ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన  వేడుకలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటున్నారని ఎంపీ ఈట‌ల అన్నారు.

ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ (Pharma city ) రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. ఫోర్త్ సిటీ పేరుతో 14,000  ఎకరాలకు తోడుగా మరో 16,000 సేకరించాలని ప్రభుత్వం చూస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని యత్నిస్తుందని  ఈట‌ల ఆరోపించారు. కొడంగల్ లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే యత్నం చేస్తున్నారు.

స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు. లగచర్ల (Lagacharla) చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు.. ప్రతీ రైతు భవిష్యత్ లో మాకు సమస్య వస్తుందని భయపడుతున్నారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, రైతులు నక్సలైట్లు కాదు. వేరే వారి భూములు అడగడం లేదని ఈటల అన్నారు. రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. కానీ రేవంత్ లా ప్రజలను ఇంతగా ఎవరూ హింసించలేదని విమ‌ర్శించారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు కాంగ్రెస్ నేత‌లు వేడుకలు చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని (PM Modi) పై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడ‌ని, ప్రజాక్షేత్రంలో ఒక మాదిరిగా..
దిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు . రేవంత్ రెడ్డి  అన్ని వర్గాలను మోసం చేశార‌ని మండిపడ్డారు. నెలనెలా రూ.4వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఆర్టీసీ కార్మికులకు రెండు పెండింగ్ పీఆర్‌సీలు ఎందుకు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు. ఆస్పత్రులలో కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణ దుకాణాల్లో  మాత్రం లిక్కర్ దొరుకుతుందిని ఎద్దేవా చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version