Friday, March 14Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి

Crime
Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది.  విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ నగారాలోని డిప్లొమా కాలేజీలో ఈ ఘటన జరిగింది. సదరు విద్యార్థి క్లాస్ కు రాకపోవడంత లెక్చరర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆగస్టు 23న కొడవలితో కాలేజీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేసినందుకు లెక్చరర్‌ను బెదిరించాడు. ఈ ఘటనపై లెక్చరర్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించగా బెల్లూరు పోలీసులు ఘటన...

 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

Crime
నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అయితే. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రయాణికుడు CKD (Chronic kidney disease), క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. అతడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు నాగ్‌పూర్‌లోని KIMS హాస్పిటల్ బ్రాండింగ్, కమ్యూనికేషన్స్ DGM ఏజాజ్ షమీ తెలిపారు. అతని మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల...

ఉగ్రవాద సంస్థలతో J&K బ్యాంక్ చీఫ్ మేనేజర్ కు సంబంధాలు.. విధుల నుంచి తొలగింపు

Crime
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ తన చీఫ్ మేనేజర్ సజాద్ అహ్మద్ బజాజ్‌కు పాకిస్తాన్ కు చెందిన ISI, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని J&K క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దర్యాప్తులో వెల్లయింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించింది. రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని బజాజ్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. బజాజ్ "ISI తరపున పనిచేస్తున్న తీవ్రవాద-వేర్పాటువాద నెట్‌వర్క్‌ల పొందుపరిచిన ఆస్తి" అని J&K CID వర్గాలు ఆంగ్ల మీడియాకు తెలిపాయి. స్థానిక దినపత్రిక అయిన గ్రేటర్ కాశ్మీర్ యజమాని, ఎడిటర్ అయిన ఫయాజ్ కలూ ద్వారా ISI సాయంతో 1990లో J&K బ్యాంక్‌లో అతను చేరాడని పేర్కొంది.సజాద్ అహ్మద్ బజాజ్ (Sajad Ahmad Bazaz)1990లో క్యాషియర్-కమ్-క్లార్క్‌గా  నియమితులయ్యారు. తర్వాత 2004లో J&K బ్యాంక్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ హెడ్‌గా పదోన్నతి పొందారు. ఆయన కోసం ప్రత్యేక...

ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి

Crime
జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపో యాయి. పైన ఉన్న మరో ముగ్గురు కూడా బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటన...

పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

Crime
ఇలాంటి కీచకులనేంచేయాలి? మధ్యప్రదేశ్‌లో అత్యాచారం కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. సాత్నాలో 5 ఏళ్ల దళిత బాలికపై నిందితులు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 10 సంవత్సరాల కారాగార శిక్ష నిందితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.. ఏడాదిన్నర క్రితం జైలు నుంచి బయటకు వచ్చి మరో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక నిపించింది. ఏం జరిగింది నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు ఆమెకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టాడు. బాలి...

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

Crime
Warangal: వరంగల్‌ జిల్లాలో బుధవారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వరంగల్‌ నుంచి ఆటో తొర్రూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.. అస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన జరిగిన యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని  తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చే...

కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..

Crime
బరేలీ (ఉత్తరప్రదేశ్): కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురు నిందితులకు బరేలీ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి యాభై వేల జరిమానా కూడా విధించింది. కల్తీ దేశీ నెయ్యి తయారు చేసిన ఐదుగురు నిందితులకు అదనపు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ కోర్టు జీవిత ఖైదు విధించించారు. ఐదుగురు నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించించారు. కల్తీకి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటివరకు ఇది అత్యధిక శిక్షగా భావిస్తున్నారు. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. 2009లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన తీర్పు 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 12న శనివారం వెలువడింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తేజ్‌పాల్ సింగ్ రాఘవ్ మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, కేసు విచారణ సందర్భంగా ఎనిమిది మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచామని తెలిపారు. కల్తీ దేశీ నెయ్యి తయారీ ప్రక్రియ నగరంలో నేలమాళిగలో నడుస్తోంది....

ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

Crime
ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది. ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే "నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని రాసి ఉంది. బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థల...

తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

Crime, Telangana
  తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.  మార్చురీలో భద్రపరిచిన   ఓ వ్యక్తి మృతదేహంలోని భాగాలను ఎలుకలు కొరికివేశాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016వ సంవత్సరంలో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రవి రెండో వివాహం చేసుకోగా వీరికి కుమారుడు జన్మించాడు. అయితేతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రవికుమార్‌ క్రమంగా మద్యాన...

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

Crime
చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...
Exit mobile version