Saturday, March 15Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు – దోషులకు క్షమాభిక్ష రద్దు

Crime
Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case : దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టంచేసింది. 11 మంది నిందితులను రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగినందు వల్ల .. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని త...

Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

Crime
రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌ రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు సూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్‌ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్ర...

Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు

Crime
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీకి (Biryani) డబ్బులు ఇవ్వలేదని 17 ఏళ్ల యువకుడిని ఓ కుర్రాడు కత్తితో పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతడిపై డ్యాన్స్‌ చేశాడు. బాధితుడైన 17ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) కాలి నడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 సంవత్సరాల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినేందుకురూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా ఆవేశానికిలోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కింద పడిపోయిన బాధితుడిపై నిందితుడు కూర్చుని మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచి...

Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Crime
లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె...

పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు

Crime
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి. ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. . లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది. " గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్...

Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Crime
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..! Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్‌ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్‌ భార్యతో కలిసి ఇటీవల  Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు. డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తలక...

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ పాక్‌లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హతం..

Crime
2016 పఠాన్‌కోట్ (Pathankot ) ఉగ్రదాడి సూత్రధారి, కీలక సూత్రదారి లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌(Pakistan ) లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పఠాన్‌కోట్(Pathankot) దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌(Shahid Latif) ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్‌కోట్ దాడికి ప్రధాన కుట్రదారు. అతను సియాల్‌కోట్ నుంచే దాడికి వ్యూహ రచన చేశాడు. దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు. చట్టవిరుద్ధమైన (కార్యకలాపాల) నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో లతీఫ్ భారతదేశంలో అరెస్టు అయ్యాడు.  విచారణ అనంతరం చివరికి జైలు పాలయ్యాడు. భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత, అతను 20...

Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Crime, National
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు. Delhi Liquor Policy Case లో ఏ...

Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

Crime
Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది. ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. నాందేడ్​లో ఉన్న డాక్టర్ శంకర్​రావ్​ చవాన్​ ప్రభుత్వ దవాఖానాలో సెప్టెంబరు 30- అక్టోబరు 1 మధ్యలో ఇక్కడ 24 మంది రోగులు చనిపోయినట్లు సోమవారం సాయంత్రం వార్త వెలుగులోకి వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం రేపింది. ఈ 24 మందిలో 12 మంది శిశువులు కావడం అత్యంత విషాదకరం. మరో 12 మందిలో ఐదుగురు పురుషులు...

Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్

Crime
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో  మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ చేయడానికి స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. మాఫియాల ప్రభావాన్ని నిర్జీవం చేయడం.. వారి అక్రమ ఆదాయ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వారిని ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మాఫియాలకు చెందిన ఆస్తులు, బినామీ ఆస్తులను గుర్తించి, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు పోలీసులు వాటిని అటాచ్ చేస్తారని అధికారులు తెలిపారు. భూ మాఫియాలపై ప్...
Exit mobile version