Friday, March 14Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

Crime
Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. " పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన చిన్న-పరిమాణంలో ఉన్న తాబేళ్లను అధికారులు కనుగొన్నారు. అలాగే ప్రయాణీకులలో ఒకరి నుండి రూ. 57,441 విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారుల ప్రకారం, వన్యప్రాణులను భారతదేశంలోకి తీసుకువెళ్లడానికి దిగుమతి పత్రాలు లేదా లైసెన్స్‌లు ఈ ప్రయాణికుల వద్ద లేవు. అడవి త...

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

Crime
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ.... ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 కోట్లకు పైగా నగదు ఆరు బాక్సు ల్లో నిం పి. వాటిని పక్క ఇం టి టెర్ర స్ పైకి విసిరేశాడు. ఇది చూసిన అధికారులు ఆ డబ్బా లను క...

రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..

Crime
సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గిరబోయిన అంజయ్య(55), గోపాల్ నగర్, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా, డోలకొండ శ్రీకాంత్(22), బచ్చన్నపేట, జనగామ జిల్లా,  శివరాత్రి బాషా, అలియాస్ భాస్కర్(27). బచ్చన్నపేట ఉన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో.. కాగా ...

ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం

Crime
అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య.. హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇ...

138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

Crime
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు. విడాకుల కేసు వేసిన భార్య సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆ...

భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి

Crime
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు. భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారని దంపతుల బంధువులు, పిల్లలు ...

ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్

Crime
నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లను భద్రపరిచినట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడి రెండు మొబైల్ ఫోన్‌లతో పాటు అతని కంప్యూటర్‌ సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న షానవాజ్ ఖాన్ అలియాస్ బడ్డో కనీసం ఆరు ఇ-మెయిల్స్ నిర్వహిస్తున్నాడని, అందులో ఒకటి ఇన్‌బాక్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ఇ-మెయిల్స్ ఉన్నాయని పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ కోసం రెండు సహా ఆరు ఇ-మెయిల్ చిరునామాలను ఖాన్ ఆపరేట్ చేస్తున్నాడని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ తెలిపారు. గత మంగళవారం నిందితుడిని ఘజియాబాద్ కో...

దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య

Crime, National
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్‌ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్ తో ధ్వంసం చేశారు. సంబంధిత పాఠశాలలో ముస్లిమేతర బాలికలను 'హిజాబ్' ధరించమని బలవంతం చేసిన కేసులో Ganga Jamna Higher Secondary School పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మంగళవారం పాఠశాలలో అనధికార నిర్మాణాల తొలగింపు చేపట్టారు. స్థానిక మునిసిపాలిటీల బృందాలు  పాఠశాల (Damoh school ) మొదటి అంతస్తును కూల్చివేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి సీనియర్ డామోహ్ జిల్లా పోలీసు అధికారి ప్రకారం, పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవల పాఠశాలకు (కేంద్ర ప్రభుత్వ-సహాయక మైనారిటీ పాఠశాల) నోటీసు అందించింది. స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన నోటీసులో పాఠశాలకు మూడు రోజ...

ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..

Crime
మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేట చమన్ కు చెందిన ప్రధాన నిందితుడు రబ్బాని(30) బీకాం పూర్తిచేసి, కొద్ది రోజులు బిగ్ సి మొబైల్ షాపులో సెల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. అనంతరం 2018 నుంచి 2021 మధ్యకాలంలో నిందితుడు రబ్బాని హనుమకొండ చౌరస్తాలోని లాట్ మొబైల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేశాడు. కొన్నాళ్లకు రబ్బానీ వ్...

అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు

Crime
అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు రూ.20వేల నుంచి 30వేల వసూలు 18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన 18 మందిని అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్ధు, మోరం అరవింద, మోరం శ్రీని వాస్ మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు,...
Exit mobile version