యూపీలో సీఎం యోగీ మార్క్.. ఫలించిన ‘బాటోంగే టు కటోంగే’ నినాదం..

UP Bypolls 2024 : ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి)తో కలిసి 9 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర , జార్ఖండ్లలో రెండో దశతో పాటు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షమైన ఆర్ఎల్డీ పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది.
UP ఉపఎన్నికల విజయం ఉత్తర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలలో ఒకదానిలో తన బలమైన పట్టును కొససాగించింది. యూపీలో యుపి ఉపఎన్నికలలో ఎన్డిఎ అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఓటర్లు ప్రధాని మోదీ నాయకత్వానికి, సిఎం యోగి పాలనకు పట్టం కట్టినట్లు స్పష్టమవుతోంది. అలాగే యోగీ హిందూ ఐక్యత కోసం ఇచ్చిన ‘బాటేంగే తో కటేంగే (Batenge Toh Katenge) నినాదం హిందూ ఓటర్లను ఆకర్షించిందని పోల్స్టర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కుందర్కి, ఖైర్, ఘజియాబాద్, ఫుల్పూర్, కతేహరి, మజవాన్, మీరాపూర్, కర్హల్, సిషామౌ సహా 9 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ 5 సీట్లు కైవసం చేసుకోగా, దాని కూటమి భాగస్వామ్య పక్షం ఆర్జేడీ కూడా పోటీ చేసిన ఏకైక సీటును గెలుచుకుంది. కర్హల్, సిషామౌ అనే రెండు స్థానాలను సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది.
2024 లోక్సభ ఎన్నికల తర్వాత యూపీలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో, సమాజ్వాదీ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆశ్చర్యకరంగా తెరపైకి వచ్చింది. అయితే, ఉపఎన్నికల్లో కూడా ఇదే విధమైన విజయం వరిస్తుందని ఆశించిన అఖిలేష్ యాదవ్ పార్టీకి భంగపాటు తప్పలేదు.పోల్స్టర్లు, విశ్లేషకులు పిఎం మోడీ నాయకత్వానికి, హిందూ ఐక్యత కోసం యోగి ఆదిత్యనాథ్ తన ప్రసిద్ధ నినాదం ‘బాటోంగే టు కటోంగే’ దూకుడు ప్రచారానికి క్రెడిట్ ఇచ్చారు.
అయితే యూపీసీఎం యోగీ మాత్రం ప్రధాని మోదీకి యోగి క్రెడిట్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోకడలు, ఫలితాలు ఎన్డిఎ-బిజెపి అభ్యర్థులకు అనుకూలంగా రావడంతో, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ఇవి నిదర్శనమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు . “ఈ విజయం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం భద్రత, సుపరిపాలన, ప్రజా సంక్షేమ విధానాలు, అంకితభావంతో పనిచేసే కార్యకర్తల అవిరామ కృషి ఫలితంగా వచ్చిందని ఆదిత్యనాథ్ తెలిపారు. “గెలిచిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు! మనం విడిపోతే మనం కట్ అయిపోతాం.. మనం ఐక్యంగా ఉంటే సురక్షితంగా ఉంటాము” అని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.