Tuesday, March 4Thank you for visiting

Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత

Spread the love

Bulldozer action | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూమ్‌లో సీసీటీవీ, దానికి సంబంధించిన‌ డీవీఆర్ ను గుర్తించామని, DVRలో ఐదు రోజుల డేటా ఉంది. సీసీటీవీ ఫుటేజీని ప్రత్యక్షంగా ప్రదర్శించిన నిందితుడు మహంత్ గోస్వామి సెల్‌ఫోన్‌ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని అరెస్టు కోసం రెండు పోలీసు బృందాలను మోహరించారు. అతను ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.

ఇదిలా ఉండగా, బుల్‌డోజర్‌ చర్యలను ఎదుర్కొన్న ప్రభుత్వ భూమిలో నిందితుడికి చెందిన‌ అక్రమ నిర్మాణాలు, దుకాణాలు ఉన్నాయని పోలీసులు, కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. 2007లో మీరట్‌లో డాక్టర్‌ను బెదిరించి రూ.50 వేలు వసూలు చేసిన కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత 2018లో అనధికారికంగా కలపను నరికి విక్రయిస్తున్నందుకు రెండుసార్లు అరెస్టయ్యాడు. పవిత్ర గంగానది ఒడ్డున అక్రమ దుకాణం కూడా నడుపుతున్నాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మే 21న ఒక తల్లి, ఆమె 14 ఏళ్ల కుమార్తె ఆలయానికి వెళ్లి, పైకప్పు లేని వాష్‌రూమ్‌లో సిసిటివి కెమెరా ఉన్న‌ట్లు గుర్తించారు. దీనిపై డీఎస్పీ వివేక్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ , “పైభాగంలో అమర్చిన సీసీటీవీ కెమెరా మహిళలు బట్టలు మార్చుకునే గదిపై ఫోకస్ చేయడాన్ని మహిళ గమనించింది.” మహిళలను చూసేందుకు అతని సెల్‌ఫోన్‌ను సీసీటీవీకి కనెక్ట్ చేశారు. సీసీటీవీ కెమెరా గురించి బాధితురాలు మహంత్ గోస్వామిని నిల‌దీయ‌డంతో అత‌డు అత‌డు ఆగ్ర‌హంతో ఊగిపోతూ అసభ్యకరంగా దూషించ‌డం ప్రారంభించాడు. కెమెరా గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడని డీసీపీ తెలిపారు. దీంతో ఆమె మురాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ న‌మోదైంది.
ఫిర్యాదు అందుకున్న , మురాద్‌నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ఆలయానికి చేరుకున్నప్పుడు, అతను అక్కడ లేడు. పోలీసులు అతనిపై ప‌లు కేసులు న‌మోదు చేశారు.

విశ్లేషణ కోసం తన మొబైల్‌ను కూడా ప‌రిశీలించామ‌ని, అయితే అందులో ఎలాంటి ఫుటేజీ కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. డీవీఆర్, మొబైల్ రెండింటినీ విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపుతున్నారు. మే 22న నిందితుడు ఆలయంలో ఉండగానే ఈ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలు కోర్టులో వాంగ్మూలం ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులు ఆపివేస్తారు. ఆమె కోర్టులో వాంగ్మూలం ఇవ్వగానే నేరస్థుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం మీరట్, ముజఫర్‌నగర్, హరిద్వార్‌లో పోలీసులు వెతుకుతున్నారు.

మే 25న నీటిపారుదల శాఖకు చెందిన బృందం వాష్‌రూమ్‌ను కూల్చివేసింది. అదనంగా, ఒక రోజు ముందు బుల్‌డోజర్‌ (Bulldozer action ) తో ఇతర ఆక్రమణలను తొలగించారు. నిరసన దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మహంత్ గోస్వామి 2004 నుంచి ఇక్క‌డ‌ స్థిరపడ్డాడు. అతను ఘాట్ (నదీతీరం)పై అనేక దేవాలయాలను నిర్మించాడు. ఆలయం వెలుపల వాష్‌రూమ్‌ను నిర్మించాడు. ఎవరూ కనిపెట్టలేని విధంగా సీసీటీవీని అమర్చినట్లు పోలీసులు తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version