Saturday, April 19Welcome to Vandebhaarath

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

Spread the love

Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు.
ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి తీయలేమని చెప్పారు. “కొన్ని శరీరభాగాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు, మిగిలిన వాటిని కాలువలో విసిరారు” అని ఆయన మీడియాతో అన్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో, ముజఫర్‌పూర్ పోలీసులు ఆదివారం ఉదయం ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారని పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్టేట్‌మెంట్ ప్రకారం, పోలీసులు అదే సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SKMCH) కు పంపారు.
వైరల్ వీడియోలో నిజానిజాలను పరిశీలిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ వీడియో వైరల్ అయి Bihar police అమానవీయ చర్యపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు కాలువ నుంచి శరీర భాగాలను వెలికి తీసి వాటిని పోస్ట్‌మార్టం కోసం కూడా పంపారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version