Friday, March 14Thank you for visiting

Andhrapradesh

Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Andhrapradesh
Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేష‌న్ల వివ‌రాలు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ...

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Andhrapradesh, Business
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

Andhrapradesh, Telangana
తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ - విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ...

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

Andhrapradesh, Telangana
AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...

Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..

Andhrapradesh
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శ‌ర‌వేగంగా స‌రికొత్త‌ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశ‌లు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న‌పుడు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదనను అట‌కెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ వేగంగా స్పందించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో రైల్వే అనేక షరతులు విధించింది. రాష్ట్రం తన వాటాను అందించాలని అలాగే భూసేకరణ ఖర్చులను కూడా భరించాలని సూచించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలాంటి షరతులు వి...

Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!

Andhrapradesh
Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది.  దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది.  ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.  గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి. రద్దయిన రైళ్లు ఇవే.. జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- విజయవాడ (12717) రత్నాచ...

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Andhrapradesh
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...

AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Andhrapradesh
AP Cabinet | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌తో పాటు శాంతి భ‌ద్ర‌త‌లు త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విప‌త్తు శాఖను వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet  శాఖ‌ల కేటాయింపు ఇలా.. చంద్ర‌బాబు ( ముఖ్య‌మంత్రి ) – సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌లు ప‌వ‌న్ కల్యాణ్( ఉప ముఖ్య‌మంత్రి) – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నారా లోకేశ్ – మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీ కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌ అనిత వంగ...

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Andhrapradesh
Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ...

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Andhrapradesh, Elections
Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబ...
Exit mobile version