Saturday, March 15Thank you for visiting

Andhrapradesh

TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

Andhrapradesh
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువ‌త‌కు మెరుగైన జీత‌భ‌త్యాలతో ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. యువ‌నేత నారా లోకేష్ (Nara Lokesh) గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా య‌త్నాలను ముమ్మ‌రం చేశారు. ఈమేర‌కు తాజాగా టాటా గ్రూపు చైర్మన్‌, సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా స‌న్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖ‌ర‌న్‌తో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో సీఎంవో అడిష‌నల్ సెక్రట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు,...

Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Andhrapradesh
Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను ప‌ల‌క‌రించ‌నున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వెస్ట్‌ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  (AP, TG Rains) మరో 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసింది. రానున్న 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో లో రానున్న మూడు రోజుల పాటు తేలిక...

పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

Andhrapradesh
South Central Railway | ప్ర‌యాణ‌కుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజ‌న్ ను దృష్టిలో పెట్టుకొని ప‌లు కీల‌క మార్గాల్లో ప్ర‌యాణించే రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ ల‌ను జోడించ‌నున్న ట్లు ప్ర‌క‌టించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అద‌నంగా కోచ్ ల‌ను జ‌త‌చేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్ర‌యాణికుల కు తాజా నిర్ణ‌యం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. ఈ రైళ్ల‌కు ఆద‌న‌పు కోచ్ లు Tirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది. రైలు నెం. 16058: తిరుపతి - డాక్ట‌ర్‌ MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఇవే తేదీలల...

Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

Andhrapradesh
Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్క‌ర‌ను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేష‌న్‌ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబ‌ర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67ల‌కు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచ‌దార‌ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి మ‌నోహర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేద‌ల‌కు సబ్సిడీ ధ‌ర‌కు కందిప‌ప్పు చెక్క‌ర అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, బ‌య‌ట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్ర‌స్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర‌ ధర రూ.45కి పైగా ఉంది. 1 KG కందిపప్పు రూ.67 1/2 KG పంచదార రూ.17. నేటి నుంచి 1.48 కోట్...

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Andhrapradesh
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...

AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండ‌ర్లపై ఏపీ స‌ర్కారు క‌స‌ర‌త్తు..

Andhrapradesh
AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్ల‌ను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొద‌లుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంట‌నే పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లకార్డు ఆధారంగా తీసుకొంటే 1.47 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండ‌ర్ ను అందించాల్సి ఉంటుంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ.3,640 కోట్ల వ‌ర‌కు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకాన్ని వ‌ర్తింప‌జేస్తే.. ఏడాదికి 1,763 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.. అయితే ఈ ప‌థ‌కాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదికను రూపొందించి ప్ర‌భుత్వానికి సమ‌ర్పించ...

దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు.. హైదరాబాద్​ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!

Andhrapradesh, Telangana
Elevated Corridor Srisailam : ప్ర‌సిద్ధ‌ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండ‌లు, ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్​ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపుల మ‌ధ్య‌ వాహనాల‌ వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాట‌డానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన ప‌రిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మ‌రోవైపు ద‌ట్ట‌మైన కీకార‌ణ్యం మ‌ధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి క‌ల్పించేందుకు తెలంగాణ స‌ర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర...

Tirupati laddoo row : తిరుమ‌ల‌కు ఆవు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ టీటీడీ ఫిర్యాదు

Andhrapradesh
Tirupati laddoo row | తిరుపతి లడ్డూలలో కల్తీపై దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్‌ (AR Dairy Foods) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయానికి కల్తీ నెయ్యి ట్యాంకర్లను సరఫరా చేసిన స‌ద‌రు కంపెనీ క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోలీసులను అభ్యర్థించింది. తిరుపతి లడ్డూ (Tirumala laddu)ల నాణ్యతపై పలువురు భ‌క్తులు ఫిర్యాదు చేశారని, ఆవు నెయ్యి కొనుగోళ్లలో అనేక సమస్యలు ఉన్నాయని టీటీడీ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భక్తులకు అందించే ప్రసిద్ధ తిరుపతి ప్రసాదం తయారీలో బీఫ్ టాలో, చేప నూనె, పంది కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు నివేదికలు సూచించడంతో లడ్డూలపై వివాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ప్రసాదం నుంచి ఎప్పుడూ లేని వాసన వస్తోందని భక్తులు ఫిర్యాదు చేయడంతో లడ్డూల్లో కల్తీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స...

Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Andhrapradesh
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌...

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..

Andhrapradesh
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు. ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు. కల్తీని అంగీకరించిన టీటీడీ కాగా తిరుమల...
Exit mobile version